TS News: జోనల్ వ్యవస్థ వచ్చేసింది
తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులకు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా... దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం నారాయణపేట జిల్లా..
మార్పులు, చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
జోగులాంబ జోన్లో నారాయణపేట జిల్లా
కాళేశ్వరం పరిధిలో ములుగు
చార్మినార్ జోన్కు వికారాబాద్
నియామకాలకు మార్గం సుగమం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులకు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా... దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం నారాయణపేట జిల్లా.. జోగులాంబ జోన్లో, ములుగు జిల్లా.. కాళేశ్వరం జోన్లో, వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్లో ఉంటాయి. మార్పులకు ఈ సంవత్సరం ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానిని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపించగా... రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది. దీని ద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లే. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రాష్ట్రం ఈ కొత్త జోనల్ విధానాన్ని వర్తింపజేయనుంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు రాష్ట్రం జోనల్ వ్యవస్థలో మార్పులు చేసింది. రెండు జోన్లను ఏడు చేసింది.కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్లో, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళ జోన్లో చేర్చింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, బహుళ జోన్, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చి మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టాలని, రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా పరిగణించింది. విద్య, ఉద్యోగాలకు జిల్లా, జోనల్, బహుళ జోనల్ పరిధిలో 95 శాతం స్థానిక, అయిదు శాతం ఓపెన్ కేటగిరీగా ప్రకటించింది. రాష్ట్ర కేడర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను 2018 మేలో కేంద్రానికి పంపించగా... అవి ఆగస్టులో ఆమోదం పొందాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 31కి తోడు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో దీనిపై ఉత్తర్వులు జారీచేశారు. రెండు కొత్త జిల్లాలను చేర్చడంతో పాటు ప్రజల విజ్ఞప్తి మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్కు మార్చాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఏప్రిల్లో ఆమోదం తెలిపింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే నియామకాలను చేపడుతున్నారు. విద్యాపరంగా సైతం ఇంజినీరింగు, వైద్య విద్య ప్రవేశాలకూ దీనినే పాటిస్తున్నారు. తాజాగా కొత్త జోనల్ విధానం పూర్తిగా ఆమోదం పొందడంతో ఇకపై 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
జిల్లా, జోన్, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ కూడా సాగనుంది. జిల్లాలు పెరిగిన సందర్భంగా ఉద్యోగులను అప్పట్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే ప్రతీ జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)ను ప్రభుత్వం ఖరారు చేయాలి. పోలీసు శాఖకు చెందిన ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్లకు సంబంధించిన జోన్లు, బహుళజోన్లను సైతం ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, జోన్, బహుళ జోన్ స్థాయి పోస్టులను నిర్ధారించాలి. ఇప్పటికే ఉద్యోగ, అధికార సంఘాలు నాలుగో తరగతి నుంచి జూనియర్ అసిస్టెంటు స్థాయి వరకు జిల్లా పోస్టులుగా, సీనియర్ అసిస్టెంటు స్థాయిలోని వాటిని జోనల్విగా, గెజిటెడ్ ఉద్యోగాలను బహుళ జోన్లవిగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.
బహుళ జోన్, జోన్ల పరిధిలోకి వచ్చే జిల్లాలు ఇవే
మొదటి బహుళ జోన్
మొదటి జోన్ కాళేశ్వరం: ఆసిఫాబాద్-కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాలు.
రెండో జోన్ బాసర : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.
మూడో జోన్ రాజన్న : కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.
నాలుగో జోన్ భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (గ్రామీణ), వరంగల్ నగర (హన్మకొండ).
రెండో బహుళ జోన్
అయిదో జోన్ యాదాద్రి : సూర్యాపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగామ.
ఆరో జోన్ చార్మినార్ : మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.
ఏడో జోన్ జోగులాంబ : మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం