ధాన్యం కొనుగోలు చేయాల్సిందే!
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ, మెదక్ జిల్లా రామోజీపల్లి గ్రామంలోనూ....
జగిత్యాలలో రైతుల ఆందోళన
రామోజీపల్లిలో విద్యుత్తు ఉపకేంద్రం ముట్టడి
జగిత్యాల, పెద్దశంకరంపేట- న్యూస్టుడే: ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ, మెదక్ జిల్లా రామోజీపల్లి గ్రామంలోనూ అన్నదాతలు నిరసనకు దిగారు. జగిత్యాలలో రైతులు పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని చివరి గింజ వరకు కొంటామన్న ముఖ్యమంత్రి, అధికారులు.. తాము ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. తాము పండించిన ధాన్యం నాణ్యత ఉన్నప్పటికీ మిల్లర్లు 40 కిలోల బస్తాపై 3 కిలోలు కోత విధిస్తున్నారని చెప్పారు. యాసంగి వరిసాగుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారన్నారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలన్నారు. ధర్మారం గ్రామానికి చెందిన రైతు మల్లేశం ఒంటిపై డీజిల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు ఫిర్యాదు చేస్తే.. మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆర్.ప్రకాశ్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా చెరకు రైతుల సంఘాధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం తరలింపునకు లారీలు కరవు
కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ధాన్యాన్ని తరలించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామ రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. పది రోజులుగా ధాన్యం మిల్లులకు తరలించడానికి లారీలు కరవయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తరలించే వరకు మిల్లులకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామంటూ స్థానిక ఉపకేంద్రాన్ని ముట్టడించారు. దీంతో అధికారులు తాత్కాలికంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మిల్లుల నిర్వాహకులతో మాట్లాడి లారీలు ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?