సచివాలయంలో కరోనా కలకలం
ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర సచివాలయం(బీఆర్కే భవన్)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్ బారినపడ్డారు. ఐఏఎస్ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య
అయిదుగురు ఐఏఎస్లు సహా 30 మందికి వైరస్
పోలీసుశాఖలో భారీగా బాధితులు
వివిధ శాఖల్లోనూ అదే పరిస్థితి
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్ర సచివాలయం(బీఆర్కే భవన్)లోనే పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు కొవిడ్ బారినపడ్డారు. ఐఏఎస్ అధికారులతో పాటు సాధారణ పరిపాలన, రవాణా, వైద్యారోగ్య, రెవెన్యూ, విద్యాశాఖలోని అధికారులు, ఉద్యోగులు 30 మందికి వైరస్ సోకింది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రవాణా, రోడ్లు భవనాల కార్యదర్శి శ్రీనివాస్రాజు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్విలతో పాటు ఆర్థికశాఖ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ శివశంకర్లకు పాజిటివ్ తేలింది. ఇప్పటికే జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజు హోం ఐసొలేషన్లో ఉన్నారు. సచివాలయంలో కరోనా కేసులు అధికమవుతుండడంతో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. మహమ్మారి బారినపడ్డ వారంతా సెలవుపై వెళ్తుండటం, క్వారంటైన్ పూర్తయ్యే వరకూ విధులకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
పోలీసుశాఖ విలవిల
పోలీసుశాఖ కరోనాతో విలవిలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో 150, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ డీఐజీ స్థాయి అధికారితో పాటు దాదాపు 300, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 350 మంది వరకూ వైరస్ బారినపడ్డారు. వరంగల్ కమిషనరేట్లో ముగ్గురు ఏసీపీలు, నలుగురు సీఐలతో సహా 99 మంది, రామగుండం పోలీసు కమిషనరేట్లో ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలతో సహా 68 మంది, వివిధ జిల్లాలో పదుల సంఖ్యలో పోలీసులకు పాజిటివ్ తేలింది. బాధితులకు ఆసరాగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో సహాయక నంబర్లు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు.
ఇతర శాఖల్లో..
పోలీసుశాఖ తర్వాత ఎక్కువ మంది బాధితులైంది ఆరోగ్యశాఖలోనే.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైద్యులతో పాటు వైద్య విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భారీగా దీని బారిన పడ్డారు. మంగళవారం ప్రజారోగ్య సంచాలకుడికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యాశాఖలోనూ అనేక మందికి కరోనా సోకింది. శాఖ కార్యదర్శి సుల్తానియాతో పాటు ఇంటర్బోర్డు, ఇంటర్ విద్యాశాఖలో 15 మంది మహమ్మారి బారినపడ్డారు. క్షేత్రస్థాయిలో పదుల సంఖ్యలో టీచర్లకు పాజిటివ్గా తేలింది. ఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్ సంచాలకులు సహా 75 మంది, ట్రాన్స్కోలో 22, వ్యవసాయ కమిషనరేట్లో 10 మంది, ఉద్యాన కమిషనరేట్లో ఇద్దరు మహమ్మారి బారినపడ్డారు. సింగరేణిలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు కలిపి 951 మంది, నీటిపారుదలశాఖలో పదిమంది ఇంజినీర్లు కొవిడ్తో బాధ పడుతున్నారు.
ఎమ్మెల్యే గండ్ర దంపతులకు పాజిటివ్
ఈనాడు, వరంగల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి జిల్లాలో పర్యటించగా.. వెంట వీరూ ఉన్నారు. వెంకటరమణారెడ్డి.. మంత్రి నిరంజన్రెడ్డితో పాటే హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్గా తేలింది.
ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్లు
7 నెలల తర్వాత ఇదే అత్యధికం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మూడోదశ ఉద్ధృతి ప్రారంభమైన తర్వాత మంగళవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2,983 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. 7 నెలల తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,14,639కి పెరిగింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు కొవిడ్ బారినపడ్డారు. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. స్వల్ప లక్షణాలున్నాయని, ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఒకేరోజులో లక్ష దాటిన పరీక్షలు
మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఇద్దరు మరణించడంతో ఇప్పటి వరకూ 4,062 మంది కన్నుమూశారు. తాజాగా 2,706 మంది చికిత్స పొంది కోలుకోగా మొత్తంగా 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. వైరస్ బారిన పడి ప్రస్తుతం రాష్ట్రంలో 22,472 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,07,904 నమూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,08,17,562కు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా జీహెచ్ఎంసీలో మాత్రం అనూహ్యంగా అధికమవుతున్నాయి. తాజాగా ఇక్కడ 1,206 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డిలో 227, హనుమకొండలో 118, సంగారెడ్డిలో 96, పెద్దపల్లిలో 81, ఖమ్మంలో 77, నిజామాబాద్లో 76, మంచిర్యాలలో 75, భద్రాద్రి కొత్తగూడెంలో 65, నల్గొండలో 61, వికారాబాద్లో 50 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. జగిత్యాల, కరీంనగర్, మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్, నాగర్కర్నూల్, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాష్ట్రంలో మరో 2,93,843 కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. 15-17 ఏళ్ల మధ్యవయస్కుల్లో ఇప్పటి వరకూ 9,63,864(అర్హుల్లో 52 శాతం) మంది టీకాలను పొందారు.
* భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మంగళవారం 100 మందికి పరీక్షలు చేయగా 57 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సింగరేణి ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ తెలిపారు. వీరిలో తనతో పాటు మరో నలుగురు సిబ్బంది, కార్మికులు కూడా ఉన్నారన్నారు.
* ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో మరో అయిదుగురు రోగులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆసుపత్రిలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 71కి చేరింది.
ఏపీలో కొత్తగా 6,996 మందికి వైరస్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండగకు చాలా మంది సొంతూర్లకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా జరిగినందువల్లే కేసులు అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. సోమవారం 4,018 (17.95%) కేసులు నమోదయ్యాయి. 24 గంటలు గడిచేసరికి కొత్త కేసులు 7 వేలకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకుంది.
చంద్రబాబుకు కరోనా
తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతా సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్లు ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి