సంక్షిప్త వార్తలు
బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు, శుక్రవారాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో
నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం నైరుతి ప్రాంతాలకు గురు, శుక్రవారాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోటపల్లి(మంచిర్యాల జిల్లా)లో 4.9 సెంటీమీటర్లు, ఇదే జిల్లా నెన్నెలలో 3.2, మందలపల్లి(భద్రాద్రి)లో 2.6, తాండ్ర (నిర్మల్)లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం అత్యధికంగా జైనథ్(ఆదిలాబాద్)లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆహార పరిరక్షణ కార్యాలయాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం అత్యధిక జిల్లాల్లో ఔషధ నియంత్రణ సంస్థకు, ఆహార పరిరక్షణ విభాగానికి సొంత భవనాల్లేవు. చాలాకాలంగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ సమీకృత భవన సముదాయాల్లోకి వీటి కార్యాలయాలను తరలించాలని నిర్ణయించింది. ఇటీవల అన్ని జిల్లాల ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ అధికారులతో మంత్రి హరీశ్రావు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సమీకృత భవన సముదాయాలు పూర్తి కావడంతో తక్షణమే వాటిలోకి మారిపోవాలని ఆదేశాలు జారీచేశారు. సొంత భవనాలు లేనిచోట ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ విభాగాల కార్యాలయాలకు సమీకృత భవనాల్లో చోటు కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ అధికారికంగా లేఖలు రాశారు. దీంతో స్పందించిన కలెక్టర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలాచోట్ల అద్దె భవనాల్లో కనీస వసతులు కరవయ్యాయని, దస్త్రాలకు భద్రత లేదని, ప్రభుత్వ భవన సముదాయంలోకి మారడం ద్వారా సదుపాయాలు మెరుగవుతాయని, అద్దె భారం కూడా తప్పుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
45వేల ఎకరాల్లో ఒకే కోత పత్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 45వేల ఎకరాల్లో ‘ఒకే ఒకసారి దూది తీసి పంట ముగించే’(సింగిల్ పికింగ్) పత్తి పంట సాగుచేయించాలని వ్యవసాయశాఖను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. ఈ విధానంలో పత్తి సాగుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం తన ఛాంబర్లో అధికారులతో సీఎస్ సమీక్ష జరిపారు. గతంలో ఈ రకం సాగుకు విత్తన కంపెనీలు ప్రయోగాలు చేసిన ప్రాంతాల్లో దీనిని విస్తరించాలని చెప్పారు.
సహజ సేద్యంపై మేనేజ్తో ఏపీ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: సహజసేద్యంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి మేనేజ్ సంస్థతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. బుధవారం రాజేంద్రనగర్లోని మేనేజ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన్రెడ్డి, మేనేజ్ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఏపీలో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు, సహజ సేద్యం పథకం మంచి నమూనాలన్నారు. వ్యవసాయ వాణిజ్యవేత్తలను, అంకుర సంస్థల ప్రోత్సాహానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో మేనేజ్ సంస్థ మరో ఎంవోయూ చేసుకుంది.
‘పోడు’ దరఖాస్తుల పరిశీలన ఎప్పుడో?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం మరింత ఆలస్యం కానుంది. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు అనుమతులు, మార్గదర్శకాలు జారీ చేయలేదు. దరఖాస్తులన్నీ గ్రామ కమిటీల వద్దే పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు వానాకాలం పంటల సాగుకు దుక్కిదున్నేందుకు వెళ్తున్న గిరిజనుల్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. పోడుపై చట్టబద్ధ హక్కులు వచ్చేవరకు భూముల్లోకి వెళ్లవద్దని స్పష్టంచేస్తున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం గత నవంబరు 8 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 12 లక్షల ఎకరాల విస్తీర్ణంపై 3.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తక్కువ దరఖాస్తులు వచ్చిన గ్రామాలు, ఆవాసాల్లో నెల రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని.. ఆరు నెలల్లోగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నా.. క్షేత్రస్థాయి పరిశీలనకు మార్గదర్శకాలు వెలువరించలేదు. జిల్లాకు 1-2 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడంతో ఈ గ్రామాల్లోనూ దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది.
సమీకృత భవనాల్లోకి ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ కార్యాలయాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం అత్యధిక జిల్లాల్లో ఔషధ నియంత్రణ సంస్థకు, ఆహార పరిరక్షణ విభాగానికి సొంత భవనాల్లేవు. చాలాకాలంగా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ సమీకృత భవన సముదాయాల్లోకి వీటి కార్యాలయాలను తరలించాలని నిర్ణయించింది. ఇటీవల అన్ని జిల్లాల ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ అధికారులతో మంత్రి హరీశ్రావు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సమీకృత భవన సముదాయాలు పూర్తి కావడంతో తక్షణమే వాటిలోకి మారిపోవాలని ఆదేశాలు జారీచేశారు. సొంత భవనాలు లేనిచోట ఔషధ నియంత్రణ, ఆహార పరిరక్షణ విభాగాల కార్యాలయాలకు సమీకృత భవనాల్లో చోటు కల్పించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ అధికారికంగా లేఖలు రాశారు. దీంతో స్పందించిన కలెక్టర్లు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలాచోట్ల అద్దె భవనాల్లో కనీస వసతులు కరవయ్యాయని, దస్త్రాలకు భద్రత లేదని, ప్రభుత్వ భవన సముదాయంలోకి మారడం ద్వారా సదుపాయాలు మెరుగవుతాయని, అద్దె భారం కూడా తప్పుతుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
కొత్తగా 49 కొవిడ్ కేసులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 49 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,92,997కు పెరిగింది. తాజాగా మరో 28 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 7,88,488 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 25న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 398 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13,627 నమూనాలను పరీక్షించారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్లో 34 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 28,052 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేశారు.
కాటన్ వస్త్రానికి కూలి పెంచాలని సమ్మె నేడు
సిరిసిల్ల(విద్యానగర్), న్యూస్టుడే: కాటన్ వస్త్రానికి కూలి ధర పెంచాలని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పవర్లూం కార్మికులు, యజమానులు(ఆసాములు) గురువారం ఒక్క రోజు సమ్మె నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాటన్ వస్త్రాన్ని నడిపించే మరమగ్గాల కార్మికులకు 10 పిక్కులకు 40 పైసలు, యజమానులకు 80 పైసలు చెల్లిస్తున్నారు. కూలి ఒప్పందం ముగిసి మూడేళ్లవుతున్నా... పెంచడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని, కార్మికులకు 10 పిక్కులకు 55 పైసలు, యజమానులకు రూ.1.10 ఇవ్వాలని కోరుతున్నారు. ఆరు నెలల్లో కూలి ధరలు పెంచుతామని గతంలో జరిగిన చర్చల్లో జిల్లా కార్మికశాఖ అధికారులు హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఆ దిశలో చర్యలు తీసుకోలేకపోయారని వారు వాపోయారు. సిరిసిల్ల ప్రాంతంలో పవర్లూం కార్మికులు 500 మంది, యజమానులు 100 మంది ఉంటారు.
బొగ్గు గనికి భూకేటాయింపులో మార్పు
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి సంస్థ పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి మండలాల్లో చేపట్టే బొగ్గు గనికి గతంలో కేటాయించిన భూమి విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థకు గతంలో 4,877 హెక్టార్ల భూమిని కేటాయించింది. అయితే, ప్రస్తుతం అంత అవసరం లేదని సంస్థ తెలుపడంతో అందులోనుంచి 3657.69 హెక్టార్లలో గని తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు ఇంధన శాఖతాజా ఉత్తర్వులో తెలిపింది. రామగిరి మండలం జల్లారం, రామయ్యపల్లి, సుందిళ్ల, లద్నాపూర్, ఉప్పలంకేశ్వరం, ముస్త్యాల, బుధవారంపేట, మంథని మండలం అక్కెనపల్లి, గుంజపడుగు, కన్నాల, పందులపల్లి, పుట్టపాక, రాచపల్లి, సిరిపురం, అద్రియాల నాగారం గ్రామాల్లోని ఈ భూముల్లో రాబోయే 50 ఏళ్ల పాటు బొగ్గు తవ్వకానికి కేటాయించినట్లు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్