కన్నెపల్లి పంపుహౌస్కు రూ.వెయ్యి కోట్ల నష్టం!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్కు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం
12 నుంచి 17 వరకు పూర్తిగా దెబ్బతిన్న మోటార్లు
ఈ ఆరూ కాళేశ్వరంలో కొత్తగా అదనపు టీఎంసీకి ఏర్పాటు చేసినవి
ఈనాడు హైదరాబాద్, ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాల్పల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్కు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మోటార్లన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించాకే తుది అంచనాకు రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోసేందుకు జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కన్నెపల్లి వద్ద పంపుహౌస్ నిర్మించారు. మొదట రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంలో 11పంపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. తర్వాత మూడో టీఎంసీ కోసం మరో 6పంపులు, మోటార్లను అమర్చారు. గత నెలలో వచ్చిన భారీవరదకు పంపుహౌస్ మునగగా, నీటిని తోడటం ప్రారంభించాక ఇప్పుడిప్పుడే పంపుహౌస్కు, మోటార్లకు జరిగిన నష్టం వెలుగులోకి వస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 12 నుంచి 17వ మోటారు వరకు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ 6 కొత్తగా అదనపు టీఎంసీకి ఏర్పాటు చేసిన మోటార్లని సమాచారం. మిగిలిన వాటిలో రెండింటికి మరమ్మతు చేయాల్సి వస్తుందని, 9 మోటార్లకు ఇబ్బంది లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంపుహౌస్ మునిగిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోకి అధికారులు ఎవరినీ పోనివ్వలేదు. తాజాగా కొన్ని ఫొటోలు వెలుగులోకి రావడంతో పంపుహౌస్కు జరిగిన తీవ్రనష్టం తెలిసింది.
కన్నెపల్లి పంప్హౌస్లోని 17 బాహుబలి మోటార్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోయేవి. వరదఉద్ధృతికి వాటి రూపురేఖలు మారిపోయాయి. పంపుహౌస్ అంతా దెబ్బతిన్న మోటార్లు, పడిపోయిన రక్షణగోడల శిథిలాలు, విరిగిన ఈవోటీ క్రేన్లు, కేబుళ్లు, చిందరవందరగా పడిన సామగ్రితో ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. కొన్ని మోటార్లు స్థానభ్రంశం కావడంతోపాటు వాటి పైభాగంలో ఉండే సాఫ్ట్లు దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న పనులు..
నీటిని తోడి మోటార్లు బయట పడిన తర్వాత బురద, ఇతర శకలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది వరకు పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా ఆరు మోటార్ల కొనుగోలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశాల నుంచి ఇంజినీరింగ్ నిపుణులు వస్తున్నట్లు సమాచారం. వారు రాగానే మోటార్ల పనితీరును పరిశీలించనున్నారు. నష్టానికి సంబంధించిన అంచనా కూడా తేలే అవకాశం ఉంది. ఈవోటీ క్రేన్లు, లిఫ్టుల భాగాలను పూర్తిస్థాయిలో తొలగించలేదు. ప్యానెల్ బోర్డుల తీగలను పరిశీలించారు. 60 శాతం వరకు తీగలు ధ్వంసం కాగా 40 శాతం వరకు పనిచేస్తాయని తెలిసింది. పంపుహౌస్కు ముందు భాగంలోని ఫోర్బే వద్ద నీటిని, వరదను తోడి శుభ్రపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్