తెలంగాణం.. స్వచ్ఛ గ్రామీణం
కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించింది. ప్రజాభిప్రాయం (350), ప్రత్యక్ష పరిశీలన (300), సేవల పురోగతి (350) కొలమానాల ఆధారంగా మొత్తం 1,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 971.62 మార్కులు సాధించి తొలి స్థానాన్ని ఆక్రమించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశంలో తొలి ర్యాంకు
టాప్-50లో 31 జిల్లాలకు చోటు
ఈనాడు, దిల్లీ: కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించింది. ప్రజాభిప్రాయం (350), ప్రత్యక్ష పరిశీలన (300), సేవల పురోగతి (350) కొలమానాల ఆధారంగా మొత్తం 1,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 971.62 మార్కులు సాధించి తొలి స్థానాన్ని ఆక్రమించింది.రెండు, మూడు ర్యాంకులను హరియాణా (927.05), తమిళనాడు (883.48) పొందాయి. ఆంధ్రప్రదేశ్కు 12వ ర్యాంకు లభించింది. జిల్లాల కేటగిరీలో ప్రకటించిన ర్యాంకుల్లో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జాతీయ స్థాయిలో రెండు, మూడు, అయిదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ కేటగిరీలో తొలిస్థానాన్ని హరియాణాలోని భివానీ పొందింది. దేశవ్యాప్తంగా 709 జిల్లాలకు ర్యాంకులు ప్రకటించగా తెలంగాణలోని 31 జిల్లాలు టాప్-50లో నిలిచాయి. జోగులాంబ గద్వాల ఒక్కటి 51వ స్థానానికి పరిమితమైంది. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం ఇక్కడి విజ్ఞాన్భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర జల్శక్తి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, గిరిరాజ్సింగ్ల సమక్షంలో జరిగిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించి విజేతలకు అందజేసింది.
దక్షిణాదిలోనూ ముందు వరుసలో తెలంగాణ
గ్రామీణ స్వచ్ఛతలో దక్షిణాదిలోనూ తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందు వరుసలో నిలిచింది. జాతీయస్థాయిలో నమూనాలు సేకరించిన 24.1% గ్రామాల్లో మాత్రమే సామాజికస్థాయి కంపోస్టింగ్ గుంతలు ఉండగా, తెలంగాణలో మాత్రం గరిష్ఠంగా 99.2% గ్రామాల్లో ఇవి కనిపించాయి.
* రాష్ట్రంలో 99.9% గ్రామాల్లో ఇంటింటి నుంచి లేదంటే ఒక ఫిక్స్డ్పాయింట్ నుంచి చెత్తను సేకరిస్తున్నారు.
* 99.4% గ్రామాల్లో ఘనవ్యర్థాల నిల్వకు ఒక ప్రత్యేక స్థలంకానీ, షెడ్కానీ ఉంది.
* 100% గ్రామాల్లో ఘనవ్యర్థాలను పారబోసేందుకు ఏదో ఒక వ్యవస్థ కనిపించింది.
* 99.8% ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఈ విషయంలో తెలంగాణ దేశంలో 9వ స్థానానికి పరిమితమైంది. ఆరు రాష్ట్రాల్లో 100% ఇళ్లకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దక్షిణాది నుంచి పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో 99.5% కుటుంబాలకు సొంత మరుగుదొడ్లు ఉన్నాయి. పుదుచ్చేరిలో కూడా ఇంతే. దీంతో ఈ రెండూ 1, 2 స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రంలో 97.5% మేర ద్రవ వ్యర్థాల నిర్వహణ
మిగత రాష్ట్రాల కంటే అత్యధికంగా రాష్ట్రంలో 97.5%మేర ద్రవ వ్యర్థాల నిర్వహణ జరుగుతోంది. 98.1% మంది గ్రామీణులు ఇక్కడ జరుగుతున్న ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది. దేశవ్యాప్తంగా 17,559 గ్రామాల్లో ఈసర్వే నిర్వహించారు. 2021 డిసెంబరు నుంచి 2022 ఏప్రిల్ మధ్య కాలంలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేను ఇప్సోస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించింది. మొత్తం 5,13,77,176 మంది ప్రజలు ఇందులో తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. తొలిర్యాంకు సాధించిన తెలంగాణ తరఫున ఆదివారం విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావులు అవార్డు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం