రూ.1,544 కోట్లతో ఉమ్మడి నల్గొండ అభివృద్ధి
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ను, తెరాసను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఆరేడు నెలల్లో నిధులన్నీ ఖర్చుచేస్తాం
దండుమల్కాపూర్లో బొమ్మల పార్కు ఏర్పాటు
సమీక్షలో మంత్రి కేటీఆర్
ఈనాడు, నల్గొండ: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ను, తెరాసను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిగా మునుగోడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఉమ్మడి నల్గొండ, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి రుణం తీర్చుకుంటామన్నారు. జిల్లాలో రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోనే రానున్న కొద్ది నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. ఒక్క మునుగోడులోనే రూ.380 కోట్లు ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న పనులన్నీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వీటికి అదనమన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రులు జగదీశ్రెడ్డి, దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్లతో కలిసి కేటీఆర్ మునుగోడులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘తిరుమల తరహాలో యాదాద్రిని అభివృద్ధి చేశాం. ఇప్పుడు రోజూ రూ.కోటి ఆదాయం వస్తోంది. 80 వేల మంది భక్తులు వస్తున్నారు. దామరచర్లలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ ఏస్థాయికి చేరుకున్నా విద్యుత్ కొరత ఉండదు. దండుమల్కాపూర్లో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేశాం. ఇందులోని 579 యూనిట్ల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అక్కడ త్వరలో బొమ్మల పార్కును 100 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా పది వేల మందికి ఉపాధి లభిస్తుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
* రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, ఎనిమిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 907 కి.మీ.ల రహదారులను రెండు వరుసలుగా విస్తరించినట్టు చెప్పారు. 6,391 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 880 గృహాలను లబ్ధిదారులకు ఇప్పటికే అందించామన్నారు. మిగతావి త్వరలోనే లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు.
* గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు తమ శాఖ తరఫున ఎనిమిదేళ్లలో రూ.1,200 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
* మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి మాట్లాడుతూ, కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలకు రూ.1,000 కోట్లతో రహదారులు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల క్రమబద్ధీకరణకు 20,444 దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన పూర్తయిందన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి నల్గొండజిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా నాలుగు చేనేత క్లస్టర్లు
కొత్తగా భువనగిరి, సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల, తెరటుపల్లిలలో చేనేత క్లస్టర్లను ఏర్పాటుచేస్తాం. నేతన్నలకు ఇస్తున్న రాయితీ పథకంలోనూ మార్పులుచేశాం. రాయితీ సొమ్ము ముందుగానే అందించాలని ఆదేశాలిచ్చాం. మునుగోడులో వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం. నారాయణపురం మండల కేంద్రంలో రూ.కోటితో బంజారా భవన్ను నిర్మిస్తాం.
కేటీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్