చదివింది మరిచిపోతున్నాం!
రాష్ట్రంలో 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే.... పరీక్షల సమయం దగ్గరపడేకొద్దీ విద్యార్థులను భయం వెంటాడుతోంది. పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నాం
టెలీ మానస్ టోల్ఫ్రీ నంబరుకు ఇంటర్ విద్యార్థుల నుంచి ఫోన్ల వెల్లువ
వారంలో 300 మందికిపైగా కౌన్సెలింగ్
జవాబు రాయలేకపోతున్నా..
నేను బాగానే చదువుతున్నా. క్లాసులో అధ్యాపకులు అడిగినప్పుడు సరిగానే సమాధానాలు చెబుతున్నా. పరీక్షల్లో మాత్రం జవాబులు రాయలేకపోతున్నా. చదివింది మరిచిపోతున్నా. ఈ సమస్య నుంచి బయటపడేదెట్లా?
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆవేదన
గుర్తు రావాలంటే ఏం చేయాలి?
పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి. చదివింది మొత్తం గుర్తుండేందుకు ఏమైనా చిట్కాలు చెబుతారా?
ఇంటర్ ప్రథమ సంత్సరం విద్యార్థి అభ్యర్థన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే.... పరీక్షల సమయం దగ్గరపడేకొద్దీ విద్యార్థులను భయం వెంటాడుతోంది. పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు టెలీ-మానస్ 14416 టోల్ఫ్రీ నంబరుకు వస్తున్న ఫోన్లే నిదర్శనం. చదివింది మరిచిపోతున్నామని, ఒత్తిడిని భరించలేకపోతున్నామని సైకాలజిస్టులకు వారు మొర పెట్టుకుంటున్నారు. పరీక్షల భయం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలుంటే ఫోన్ చేయాలని ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించింది. టోల్ఫ్రీ నంబరులో సైకాలజిస్టులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని, వారు కౌన్సెలింగ్ నిర్వహించి, పరిష్కారాలు సూచిస్తారని భరోసా ఇచ్చింది. ఈక్రమంలో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల వ్యవధిలోనే 300కిపైగా ఫోన్లు వచ్చాయని టెలీ-మానస్ వర్గాలు తెలిపాయి. వీటిలో ఒకట్రెండు మాత్రమే పదో తరగతి వారి నుంచి ఉన్నాయని, మిగిలినవన్నీ ఇంటర్ విద్యార్థులే చేశారని వెల్లడించారు. అంటే... ఇంటర్ విద్యార్థులే అధికంగా ఒత్తిడికి గరవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎక్కువ మంది చదివింది గుర్తుండటం లేదని, మరిచిపోతున్నామని, ఆందోళనగా ఉందని, ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని, వారికి ఫోన్లోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని కౌన్సెలర్లు వివరించారు.
అధిక శాతం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే
ఫోన్ చేసిన విద్యార్థుల్లో 90 శాతానికిపైగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే ఉన్నారని ఓ కౌన్సిలర్ ‘ఈనాడు’కు తెలిపారు. ఇంటర్ పరీక్షల ఒత్తిడి ఒకటైతే... ఆ తర్వాత జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్లలో అర్హత సాధిస్తామా? మంచి ర్యాంకు వస్తుందా? అన్న ఆందోళన ఈ గ్రూపుల విద్యార్థుల్లో అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ ఫీజు చెల్లించి ప్రైవేట్, రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివే వారిపై ఇలాంటి ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీరి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మార్కులను, ర్యాంకులను కచ్చితంగా తెచ్చుకొని తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తే పిల్లలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగా టోల్ఫ్రీకి విద్యార్థుల నుంచే అధిక శాతం ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనికి విద్యార్థులతోపాటు మానసిక సమస్యలున్న వారు ఎవరైనా ఫోన్ చేయవచ్చు. గత అక్టోబరు నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 వేల ఫోన్లు వచ్చాయి. అందులో అత్యధికం పరీక్షలకు సంబంధించిన సమస్యలే. ఆ తర్వాత మానవ సంబంధాలు(హ్యూమన్ రిలేషన్షిప్), ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
ఇవీ మానసిక కౌన్సెలర్ల సూచనలు
చదివింది మరిచిపోతున్న, ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు టెలీ-మానస్ కౌన్సెలర్లు చెబుతున్న పరిష్కారాలు, సూచనలు ఇవీ...
* మొదట పరీక్షలంటే భయం వదలండి. మీరనుకున్నట్లు అవి భయపెట్టవు. ప్రశ్నపత్రం చూడగానే దీనికేనా అంత భయపడిందని అనుకుంటారు.
* మిమ్మల్ని మీరు తోటి విద్యార్థులతో అస్సలు పోల్చుకోవద్దు.
* అర్ధరాత్రి వరకు చదవడం మంచిది కాదు. అలా చదివినా బుర్రకు ఎక్కదు. ఎక్కువ మంది ఈ తప్పే చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు నిద్రపోయి, ఉదయం 6 గంటలకు లేవండి. కనీసం 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. కొద్దిసేపు వ్యాయామం/యోగా చేసి... అల్పాహారం తీసుకొని చదవడం ప్రారంభించాలి.
* ప్రతి 45 నిమిషాలు లేదా గంటకు ఒకసారి 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.
* ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ప్రణాళిక వేసుకొని అమలు చేయాలి.
* ఆయా అంశాలపై ముఖ్యమైన పాయింట్లు రాసుకొని... వాటిని తరచూ గుర్తుచేసుకుంటూ ఉండాలి.
* పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్లను అర్థం చేసుకొని చదవాలి. అందుకు మీ అధ్యాపకుల సహకారం తీసుకోండి.
* ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. దాన్ని దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా చదువుకుంటున్న సమయంలో ఫోన్ను స్విచ్ఛాప్ చేయండి. టీవీలను కట్టేయండి.
* చదవడంతోపాటు గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలను రాయడం, ప్రాక్టీస్ చేయడం అత్యంత ముఖ్యం.
ఏమిటీ టెలీ-మానస్?
టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ను... సంక్షిప్తంగా టెలీ-మానస్గా పిలుస్తారు. అంటే ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు. దీనికి 14416 అనే టోల్ఫ్రీ నంబరును ఇచ్చారు. దేశంలో రోజురోజుకూ మానసిక సమస్యలు పెరుగుతుండటం, కరోనా మహమ్మారి తర్వాత సమస్య తీవ్రత మరింత ఎక్కువైన నేపథ్యంలో టోల్ఫ్రీ నంబరును ప్రవేశపెడతామని 2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు 2022 అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో హైదరాబాద్ వెంగళరావునగర్లో ఈ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బెంగళూరులోని నిమ్హాన్స్ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు కోరుకున్న భాషలో సమస్యను వివరించేలా టోల్ఫ్రీ నంబరును రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు