పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ యోచన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి.. పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంతమేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థికసాయం అందించింది. ఈ మేరకు గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి 2016-17లో ఒకసారి రూ.1,100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థికసాయం అందింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ సుమారు రూ.430 కోట్ల వరకు కేంద్రం నుంచి అందనున్నాయి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అంత అనుకూలంగా లేవన్నది అధికారుల అభిప్రాయం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సహాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతోపాటు షరతులూ అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం రూ.72 వేలు మాత్రమే అందజేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన రూ.మూడున్నర లక్షలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.
ఇళ్లపై రెండు లోగోలు..!
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగోను విధిగా ముద్రించాలన్నది కేంద్రం విధించిన షరతుల్లో ఒకటి కాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లోగోను తయారు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లో సైతం ఈ అంశాన్ని పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లా ఇన్ఛార్జి మంత్రులే కీలకం..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రుల పాత్ర కీలకంగా ఉంది. ఏ గ్రామంలో, పురపాలికల్లో ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలన్న అంశం నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులదే తుది నిర్ణయంగా ఉంది. ఇంటి నిర్మాణాన్ని రెండు దశల్లో పరిశీలించేందుకు గాను.. ‘చెకర్స్, మార్కర్స్’ పేరిట తనిఖీ అధికారులను ఎంపిక చేయడంలోనూ ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ