మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం.
బాల సాహిత్యంలో ప్రత్యేక ఒరవడి
పిల్లల్లో పఠనాసక్తి పెంచడమే లక్ష్యం
రెండు దశాబ్దాలుగా అక్షరసేద్యం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. పిల్లల మనోవికాసానికి 20 ఏళ్లుగా కృషి చేస్తోందీ సంస్థ. బాల్యం నుంచీ పఠనాసక్తి పెంపొందించేలా కథలు, విజ్ఞాన ప్రచురణలు తేట తెలుగులో ముద్రిస్తోంది. సొంత ప్రచురణలకు తోడు.. ఇతర సంస్థలు ముద్రణను ఆపేసిన పుస్తకాలను కూడా కొనుగోలు చేసి మరీ పంపిణీ చేస్తోంది. దేశ, విదేశీ భాషల్లోని మంచి బాల సాహిత్యాన్ని అనువాదం చేసి ఈ తరం పిల్లలకు అందిస్తోంది. ఈ నెలాఖరుతో ఆ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. తార్నాకలోని సెయింట్ యాన్స్ జెనరలేట్లో ఈ నెల 27వ తేదీన రెండు దశాబ్దాల వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టీల్లో ఒకరైన కొసరాజు సురేశ్తో ‘ఈనాడు’ ముచ్చటించగా.. సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.
అలా శ్రీకారం..
తెలుగులో పిల్లల పుస్తకాలు పెద్దగా రాని రోజుల్లో స్నేహితుల తోడ్పాటుతో కొసరాజు సురేశ్ 2002లో ‘పుస్తకాలతో స్నేహం’ పేరిట హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థలు, రచయితల నుంచి అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని సేకరించి ప్రదర్శించారు. అక్కడ లభించిన ప్రోత్సాహంతో ‘మంచి పుస్తకం’ ప్రచురణ ప్రస్థానం మొదలైంది. అంతకంటే ముందు బాలసాహితి పేరుతో కొన్ని పుస్తకాలు ప్రచురించిన అనుభవం వీరికుంది. ఇప్పటివరకు 500కు పైగా పుస్తకాలను ప్రచురిస్తే అందులో పిల్లల కోసం ఉద్దేశించినవే 383 ఉన్నాయి.
కార్డు మీద కథ
చిన్నారులకు పఠనం విసుగు అనిపించకుండా.. చదవడం అలవాటు చేసే క్రమంలో కథా కదంబం పేరుతో సరికొత్త ప్రయోగం చేశారు. కేవలం నాలుగు పేజీలుండే కార్డుపై ఒక్కో పేజీలో ఒకటి రెండు వాక్యాలతో బొమ్మల కథ ఉండేలా 50 కార్డు కథలను ప్రచురించారు. 5 నుంచి 8 ఏళ్ల చిన్నారులను ఈ ప్రయోగం బాగా ఆకట్టుకుంది. కార్డు కథల నుంచి క్రమంగా పుస్తకంలోని కథల్లోకి తీసుకు వచ్చారు. ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో వేర్వేరు వయసు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 64 పేజీల వరకు ఉండే రచనలను ప్రచురించారు. ఇలా ఇప్పటివరకు 85 పుస్తకాలు ముద్రించారు. కథలు, బొమ్మల పుస్తకాలతో పాటు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు తెలుగు అనువాదాలు తెచ్చారు. జన విజ్ఞాన వేదికతో కలిసి ఉమ్మడిగా ప్రచురిస్తుండడంతో తమపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. రచనలు ఎక్కువ మందికి చేరువయ్యాయని ట్రస్ట్ కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
అనువాదాలతో ఆరంభించి..
తొలినాళ్లలో పరిమిత ఆర్థిక వనరుల కారణంగా.. అనువాద రచనలను ఎక్కువగా ప్రచురించేవారు. రష్యన్, ఆఫ్రికన్ తదితర భాషల అనువాదాలు అందుబాటులోకి తెచ్చారు. క్రమేణా తెలుగు మూల రచనలను ప్రోత్సహించారు. 2017 నుంచి తానా సంస్థతో కలిసి తెలుగు కథల రచనలను ఆహ్వానిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు, ఆ పై వయసు వారికి సాహస, సైన్స్, కాల్పనిక, హాస్య నవలలను ఎంపిక చేసి ప్రచురించడం మొదలెట్టారు. 21 నవలలు, 28 బొమ్మల కథలు ప్రచురించారు. తెలంగాణ తియ్యని పలకరింపు పేరుతో బడి పిల్లల కథలను ప్రచురిస్తున్నారు. పిల్లలు రాసిన 306 కథల్లో 51 రచనలను ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
ఎక్కువగా అడిగే పుస్తకాలు
చిన్న పిల్లల కోసం బొమ్మల కథలు, పెద్ద పిల్లల కోసం నీతికథలు, జీవితగాథలు, స్ఫూర్తిదాయక, జీవన నైపుణ్యాలకు సంబంధించిన పుస్తకాలు, నిఘంటువులు ఎక్కువగా అడుగుతుంటారని సురేశ్ చెప్పారు. ప్రైవేటు బడుల్లోని పిల్లలు ఆంగ్ల మాధ్యమం కారణంగా తెలుగులో ధారాళంగా చదవలేకపోతున్నారని.. ప్రభుత్వ బడుల్లోని పిల్లలు వనరులు సరిగా లేక తెలుగు నేర్చుకోవడంలో తడబడుతున్నారని అన్నారు. పిల్లలకు తెలుగు నేర్పాలనే తపన ప్రైవేటు బడుల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కనిపిస్తోందని, వారు పుస్తకాలు కొంటున్నారని తెలిపారు. పిల్లల పుస్తకాల కోసమైనా, గ్రంథాలయాలు, పాఠశాలలకు వాటిని ప్రదానం చేయాలనుకున్నా.. తార్నాకలోని ‘మంచి పుస్తకం’ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్లోనూ ఆర్డర్ చేయవచ్చు. కార్యాలయ వేళల్లో కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మిని 94907 46614 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
బాలసాహితి నుంచి మొదలై..: కొసరాజు సురేశ్, ట్రస్టీ, మంచి పుస్తకం
‘మంచి పుస్తకం’ కంటే ముందు 1990లో బాల్రెడ్డి, సుబ్బయ్య, రాజేంద్రప్రసాద్, నేనూ కలిసి బాల సాహితి అనే సంస్థను ప్రారంభించాం. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ.. దాదాపు పదేళ్ల పాటు 35 పుస్తకాలను ప్రచురించాం. ‘ఈనాడు’ రైతేరాజులో నేను ఉప సంపాదకుడిగా అనువాదాలు చేసిన అనుభవం బాల సాహితికి ఉపయోగపడింది. తర్వాత వాసన్ స్వచ్ఛంద సంస్థలో చేరాను. నా అభిరుచిని గమనించి అక్కడ ఒక అల్మారాలో పుస్తకాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించారు. ఇక్కడే మిత్రుల సహకారంతో మంచి పుస్తకానికి బీజం పడింది. రవీంద్ర, ఎస్.ఎస్.లక్ష్మి, నేను ట్రస్టీలుగా 2004 ఏప్రిల్ 29వ తేదీన ‘మంచి పుస్తకం’ ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును మూలధనంగా పెట్టాం. పాఠకులు, స్వచ్ఛంద సంస్థల ఆదరణ ఫలితంగా ‘మంచి పుస్తకం’ ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో 20 ఏళ్లుగా సాఫీగా నిర్వహిస్తున్నాం. ఎంవీ ఫౌండేషన్, రెడ్డీస్ ఫౌండేషన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పుస్తకాలను కొని పాఠశాలలు, గ్రంథాలయాలకు అందిస్తున్నాయి. తార్నాకలో కార్యాలయం అద్దెకు తీసుకున్నాం. నాతో పాటు కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి పూర్తికాలం పనిచేస్తున్నారు. బాలల్లో పఠనంపై ఆసక్తి, పుస్తకాలపై ప్రేమ కల్పించాలనేది మా ప్రయత్నం.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
దాల్మియాకు చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్, పునీత్ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం చేసుకోలేం
మాజీ మంత్రి, నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ సమర్పించిన నామినేషన్ను ఎన్నికల అధికారి అంగీకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. -
కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణపై ఏపీ దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలతోపాటు వాటి అవుట్లెట్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వాటిని కృష్ణా ట్రైబ్యునల్-1 తీర్పు ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్కు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి మంగళవారం జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం, ఉపాధ్యక్షుడిగా ఎన్.రంగారెడ్డి గెలుపొందారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర