కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు దిల్లీ హైకోర్టులో విచారణ

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం దిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

Published : 10 May 2024 03:48 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారం దిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. సీబీఐ, ఈడీలు తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసుకున్న దరఖాస్తులను ఇక్కడి రౌజ్‌ అవెన్యూకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం కొట్టివేశారు. దీంతో కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని