Huzurabad By Election: ప్రజల్లో ఉన్నాం.. ప్రగతి చూపిస్తాం
ఉద్యమాల గడ్డ... చైతన్యవంతమైన ప్రాంతం... హుజూరాబాద్... ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా
నేను గెలిస్తే పేదలు గెలిచినట్టే..- గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెరాస
ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా - ఈటల రాజేందర్, భాజపా
ప్రశ్నించే గొంతుకనవుతా.. - బల్మూరి వెంకట్, కాంగ్రెస్
గెలుపుపై హుజూరాబాద్ ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా
ఈనాడు ముఖాముఖిలో హుజూరాబాద్ అభ్యర్థులు
ఈనాడు డిజిటల్- కరీంనగర్
ఉద్యమాల గడ్డ... చైతన్యవంతమైన ప్రాంతం... హుజూరాబాద్... ఉపఎన్నిక నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ విధానాలను ప్రజల ముందుంచుతూ తమను ఆశీర్వదించమంటూ అభ్యర్థిస్తున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఉపసమరంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాను గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అంటుండగా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తానని భాజపా అభ్యర్థి ఈటల విశ్వాసం ప్రకటించారు. తాను విజయం సాధిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయంపుట్టి హామీలు అమలు చేస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అన్నారు. విజయంపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేశారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో వారు తమ మనోగతాలను ఆవిష్కరించారు.
ఏమి చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు..?
గెల్లు శ్రీనివాస్ యాదవ్: అభివృద్ధిని చూసి ఓటెయ్యండని ఓట్లు అడుగుతున్నా. కేసీఆర్ హయాంలో ఇంతటి సంక్షేమం చేరువవుతోంది. ఈ దేశంలో ఎకరానికి 10 వేల రూపాయలను ఇచ్చిన రాష్ట్రం లేదు. భాజపా అధికారంలో ఉన్న చోట కూడా పింఛన్లు ఇంతలా అందడంలేదు. రాష్ట్రం తెచ్చిన పార్టీ.. సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న పార్టీ, దేశంలో ఆదర్శ పాలనను చేరువ చేస్తున్న తెరాసను గెలిపించాలని కోరుతున్నా. ఉద్యమకారుడిని, విద్యార్థి నాయకుడిని, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాలంటూ ఓటు అడుగుతున్నాను.
ఈటల రాజేందర్: హుజూరాబాద్ ప్రజలకు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎలాంటి మనిషో చాలా బాగా తెలుసు. ఇక్కడి ప్రజల కళ్లల్లో కదలాడిన వ్యక్తిని నేను. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా వారి ఇంట్లో మనిషి లెక్క మెదులుతున్నాను. అందుకే వారిని ధైర్యంగా ఓటు అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నా పోరాటాన్ని చూసిన ఓటర్లే మళ్లీ నన్ను గెలిపించుకుంటారనే ధీమాతో ఓట్లు అడుగుతున్నా.
బల్మూరి వెంకట్: రాష్ట్రస్థాయిలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, పోరాడిన వ్యక్తిగా ఒక్క అవకాశాన్ని ఇవ్వమని కోరుతున్నాను. విద్యార్థుల పక్షాన నిలబడతా. రైతుల ఇక్కట్లు తెలిసిన వ్యక్తిగా అన్నదాత దగా పడకుండా చూస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీల వైఫల్యాల్ని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నా. ఎడ్యుకేషన్ హబ్, రెండు పడకగదుల ఇళ్లు.. ఇలా నెరవేర్చని హామీలను అర్థమయ్యేలా వివరిస్తున్నా.
ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీ విజయావకాశాలెలా ఉన్నాయి..?
గెల్లు శ్రీనివాస్ యాదవ్: ఊరూరా మంచి స్పందన లభిస్తోంది. ఈటల రాజీనామాకు అర్థం లేదని జనాలే అంటున్నారు. ఇన్ని పథకాలు పెట్టిన తరువాత వేరే పార్టీకి ఎందుకు ఓటు వేస్తామంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డకు అవకాశం ఇస్తామనే మాటల్ని బలంగా వినిపిస్తున్నారు. ఈటలకు రెండున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజీనామా చేసి బాధ్యత నుంచి తప్పుకొన్నారు. తప్పకుండా విజయం సాధిస్తాననే సంపూర్ణ విశ్వాసం ఉంది. ‘మాకు పార్టీ ముఖ్యం. వ్యక్తులు ముఖ్యం కాద’ని ప్రజలే బాహాటంగా చెబుతున్నారు.
ఈటల రాజేందర్: ఊరూరా బ్రహ్మరథం పడుతున్నారు. నాకు జరిగిన కష్టాన్ని, నష్టాన్ని వారి బాధగా స్వీకరిస్తున్నారు. అయ్యో బిడ్డకు ఇంత అన్యాయం జరిగిందా..? అంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. నా రాజీనామా వల్లనే నియోజకవర్గానికి మరిన్ని ప్రగతి ఫలాలు అందుతున్నాయి. నేను ఆనాడు మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేశా. రాజీనామా చేసిన తరువాత కూడా పింఛన్లు, రేషన్కార్డులు, దళితబంధును ఇవ్వడానికి నేనే కారణమయ్యానని ప్రజలు అమితంగా నన్ను ఆదరిస్తున్నారు.
బల్మూరి వెంకట్: ఎక్కడికి వెళ్లినా.. గెలువు బిడ్డా అని ప్రతి తల్లీ ఆశీర్వదిస్తోంది. ప్రతి చెల్లీ మంగళహారతి పడుతోంది. తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తూ సహకరిస్తున్నారు. దళితబంధు విషయంలో ఆ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల్ని ఓటర్లే మాకు చెబుతున్నరు. రైతుబంధు ఇస్తున్నప్పుడు దళితబంధు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘గల్లీలో కుస్తీ-దిల్లీలో దోస్తీ’ అనేలా తెరాస, భాజపాల వ్యవహారముందని చెబుతున్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరవలేదు.
మీకే ఎందుకు ఓటు వెయ్యాలంటే ఏంచెబుతారు.?
గెల్లు శ్రీనివాస్ యాదవ్: ఉద్యమకారుడికి, పేదవాడికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. నేను గెలిస్తే ఈ నియోజకవర్గంలోని పేదలందరూ గెలిచినట్టుగా భావిస్తాను. 80 శాతం ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రతినిధిగా మారుతాను. రాష్ట్రంలో అధికారమున్న పార్టీ కనుక వందల కోట్ల నిధుల్ని తెప్పించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. ఈటల ముఖ్యమంత్రిని కలవలేడు. అదే నేను గెలిస్తే నేరుగా సీఎంను కలిసి ఇక్కడి అవసరాల్ని తీర్చేలా నిధుల్ని తీసుకురాగలుగుతాను. ఉద్యమంలో జైలుకు వెళ్లివచ్చా. త్యాగాలు చేశాను కాబట్టి నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.
ఈటల రాజేందర్: ఆరుసార్లు ఇక్కడి ప్రజల బిడ్డగా గెలిచాను. అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. తెలంగాణ ఉద్యమంలో నా పోరాటం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ నాపట్ల అవలంబించిన వైఖరిని అందరూ గమనించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన హుజూరాబాద్ ఓటర్లు నన్ను గెలిపించి రాష్ట్రవ్యాప్తంగా చైతన్యాన్ని నింపాలనే ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. తెరాస వాళ్లు ఎన్ని డబ్బులను పంచి ప్రలోభాలు పెట్టినా.. మద్యాన్ని పారించినా.. ప్రజలు మాత్రం ఓటు చైతన్యంతో నాకు విజయాన్ని అందిస్తారు. ఇక్కడ గెలిచి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తా.
బల్మూరి వెంకట్: నాకెందుకు ఓటు వెయ్యాలో అర్థమయ్యేలా చెబుతున్నాను. ఇదే నియోజకవర్గంలో ఓటర్లు భాజపాకు ఓటు వేసి ఎంపీగా సంజయ్ను గెలిపిస్తే ఆయన చేసిందేమీ లేదు. మళ్లీ ఈటల గెలిచినా చేసేదేమీ ఉండదు. 17 ఏళ్ల నుంచి ప్రజలు తెరాసకు అవకాశమిచ్చినా వారు ఏంచేయట్లేదు. తెరాస గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టు. భాజపా గెలిస్తే ఈటల గెలిచినట్టు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఒక నిరుద్యోగిని గెలిపించినట్టు. నేను గెలిస్తేనే రెండు ప్రభుత్వాలకు భయం పుడుతుంది. వచ్చే ఎన్నికల్లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు నెరవేర్చేందుకు ఆస్కారముంటుంది.
నియోజకవర్గంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలేమున్నాయి.?
గెల్లు శ్రీనివాస్ యాదవ్: అభివృద్ధి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేరుస్తాను. చాలా చోట్ల సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు లేవు. ఇటీవల కొన్ని మంజూరయ్యాయి. వాటిని పూర్తిచేసే బాధ్యతను తీసుకుంటాను. గతంలో సరైన పర్యవేక్షణ లేకుండా నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తాను.
ఈటల రాజేందర్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలబెట్టాను. విద్య, వైద్యం విషయంలో అనూహ్య మార్పులు చూపించాను. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధికి అదనంగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. అభివృద్ధి అంటే సీసీ రోడ్లు, భవనాల నిర్మాణాలు కావు. అవన్నీ అందిస్తూనే.. ఇక్కడి ప్రజల వికాసానికి ఊతమిచ్చేలా, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అసలైన ప్రగతిని అందిస్తాను. కేంద్రం నుంచి దండిగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాను.
బల్మూరి వెంకట్: నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. యువతకు ఉపాధి అవకాశాల్ని అందించడంపై దృష్టి సారిస్తాను. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సమస్యల్ని వింటూ నమోదు చేసుకుంటున్నా. వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. బరిలో ఉన్న ఇతరులు వీటిపై నోరు విప్పడంలేదు.
ఈసారి మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు.?
గెల్లు శ్రీనివాస్ యాదవ్: వైద్యకళాశాల హామీని నెరవేరుస్తాను. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాల్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయిస్తాను. హుజూరాబాద్ నుంచి పెద్దపల్లి వరకు నాలుగులైన్ల దారిని నిర్మించేలా చొరవ చూపిస్తాను. జమ్మికుంట, హుజూరాబాద్ పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా చూస్తాను.నియోజకవర్గాన్ని పారిశ్రామిక కారిడార్గా మారుస్తాను.
ఈటల రాజేందర్: కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిపరంగా అండగా నిలుస్తాను. అందరి పక్షాన నిలబడుతూ.. వారి గొంతుకనై సరికొత్త భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తాను. ప్రజల ఆకాంక్షలకు వారథిగా నిలుస్తూ 2023లో భాజపాను అధికారంలోకి తెచ్చేలా అందరిలో చైతన్యాన్ని నింపుతాను.
బల్మూరి వెంకట్: విద్య, వైద్యం, ఉద్యోగం అందేలా చూస్తాను. ఈ మూడు దరిచేరితే దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి. ఇక్కడ 80 వేలకుపైగా గడపలుండగా ప్రతి ఇంట్లో విద్యార్థి లేదా నిరుద్యోగి ఉన్నారు. ఇవన్నీ వస్తే ఆ కుటుంబం నిలదొక్కుకుంటుంది. నేను ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతాను. మార్పు కోసం ఓటెయ్యమని అందరినీ అడుగుతున్నా.
- ఈనాడు డిజిటల్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి