Telangana News: బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. దీనికి అనుగుణంగా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక సంస్థలను ఖరారు చేసి
బోర్డులు లేని శాఖల పోస్టులు టీఎస్పీఎస్సీకి
వరుసగా నోటిఫికేషన్లకు అన్నిశాఖలు సన్నద్ధంగా ఉండాలి
సమీక్షలో సోమేశ్కుమార్ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. దీనికి అనుగుణంగా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక సంస్థలను ఖరారు చేసి.. త్వరితగతిన ప్రక్రియ పూర్తయ్యేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒక్క పోస్టు కూడా నిలిచిపోయే పరిస్థితి రావద్దన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ సన్నాహాలపై గురువారం సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పోస్టుల వారీగా నియామక సంస్థల ఎంపిక, తొలి నోటిఫికేషన్ తేదీ తదితర అంశాలను సీఎస్ శుక్రవారం లేదా శనివారం సీఎం కేసీఆర్కు నివేదించి, ఆయన ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తోంది.
అన్నింటికి ఆర్థిక శాఖ ఆమోదం ఇప్పిస్తాం
సమీక్ష సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. ‘‘మున్ముందు నియామకాలకే అన్ని ప్రభుత్వ శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి దీని కోసం ఆర్థికశాఖకు సమాచారం ఇవ్వాలి. పబ్లిక్ సర్వీసు కమిషన్ పరిధిలో పోస్టులుంటే వారికి సమాచారం ఇవ్వాలి. ఖాళీలు, సర్వీసు నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ తదితర సమాచారం ఆర్థికశాఖకు శాఖలు అందిస్తే వెంటనే అనుమతి ఇస్తాం. ఆ వెంటనే సంబంధిత నియామక సంస్థ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకేసారి మొత్తంగా గాకుండా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తగిన వ్యవధితో నోటిఫికేషన్లు వస్తాయి. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. ఏ విషయంలోనూ గందరగోళానికి తావీయవద్దు’’ అన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, విద్య, వైద్యశాఖ కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి. పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
తొలి ప్రకటన పోలీస్ శాఖ నుంచి
సమీక్ష సమావేశంలో పోలీసుశాఖ అధికారులు తాము 18 వేలకు పైగా నియామకాలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలియజేయగా...ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో మంచిరోజు చూసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని సీఎస్ సూచించారు. అంటే తొలి నోటిఫికేషన్ పోలీసు శాఖ నుంచి వెలువడనుంది. మరోవైపు టెట్ నిర్వహణతో పాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణ కోసం, వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది నియామకాలను ఆ శాఖ బోర్డు చేపట్టేందుకు సైతం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి భర్తీ చేయాలని నిర్దేశించారు. గురుకులాల ప్రత్యేక బోర్డు ద్వారా వాటి పరిధిలోని పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూపు పోస్టులను భర్తీకి సన్నద్ధం కావాలని సీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM