AP News: ఐదేళ్ల పాలనలో.. ఆంధ్రావనిని భ్రష్టు పట్టించిన జగన్‌

గాల్లో మేడలు కట్టాలన్నా.. మేడలు కూల్చాలన్నా.. జగన్‌కి తెలిసినట్టు మరేవ్వరికీ తెలియదు కావొచ్చు. అందుకేనేమో రాష్ట్రంలో పట్టణాలను నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీల పథకాన్ని నీరు గార్చారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తీర్చిదిద్దుకుంటే అద్భుతమైన నగరాలను సృష్టించవచ్చు. కానీ, కేంద్రం సాయాన్ని కాలదన్ని వచ్చిన అవకాశాలు విడిచి పెట్టి మెుండి వైఖరితో రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్న ఒకే ఒక అక్కసుతో ప్రాజెక్టులన్నింటిని గాలికొదిలేశారు.

Published : 06 May 2024 11:39 IST

గాల్లో మేడలు కట్టాలన్నా.. మేడలు కూల్చాలన్నా.. జగన్‌కి తెలిసినట్టు మరేవ్వరికీ తెలియదు కావొచ్చు. అందుకేనేమో రాష్ట్రంలో పట్టణాలను నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీల పథకాన్ని నీరు గార్చారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తీర్చిదిద్దుకుంటే అద్భుతమైన నగరాలను సృష్టించవచ్చు. కానీ, కేంద్రం సాయాన్ని కాలదన్ని వచ్చిన అవకాశాలు విడిచి పెట్టి మెుండి వైఖరితో రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్న ఒకే ఒక అక్కసుతో ప్రాజెక్టులన్నింటిని గాలికొదిలేశారు. విశాఖ, విజయవాడకు సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్టుకు మంగళం పాడారు. అమరావతిని కాదని కొత్తగా విజన్ విశాఖను అభివృద్ధి చేస్తానని జగన్ మాయ చేస్తున్నారు. జగన్ చేసిన స్మార్ట్ సిటీలను నిర్వీర్యం చేయడానికి చేసిన ఆ స్మార్ట్ కుట్రేంటి? అభివృద్ధి లేక నగరాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? 

Tags :

మరిన్ని