Amit Shah: అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే ఏపీలో కూటమి: అమిత్‌షా

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని భాజపా(BJP) అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు.

Published : 05 May 2024 15:32 IST

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని భాజపా(BJP) అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ అవినీతిలో కూరుకుపోయి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

మరిన్ని