Anitha: జగన్‌ను గద్దె దింపడమే ఏపీ ప్రజల టార్గెట్‌!: వంగలపూడి అనిత

ఏపీలో గ్రామాలు, పట్టణాలు అనే వ్యత్యాసం లేకుండా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు.

Published : 05 May 2024 19:21 IST

ఏపీలో గ్రామాలు, పట్టణాలు అనే వ్యత్యాసం లేకుండా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. ప్రత్యేకించి మహిళలు వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయారని ఆమె తెలిపారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతాంగాన్ని వైకాపా సర్కారు ఇబ్బందులపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని అందరూ గ్రహించారని చెప్పారు. జగన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అనిత అన్నారు.

Tags :

మరిన్ని