AP News: ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు.. బకాయిల తాయిలం!

ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్‌ ప్రభుత్వం పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ.. వారికి సరెండర్‌ లీవుల బకాయిలను హడావుడిగా చెల్లిస్తోంది.

Published : 27 Apr 2024 09:57 IST

ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్‌ ప్రభుత్వానికి పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్‌ లీవుల బకాయిలను హడావుడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేయగా, ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశముంది.

Tags :

మరిన్ని