AP News: పోస్టల్‌ ఓటుకు పోటెత్తుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అంగన్‌వాడీలు

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో ఉద్యోగవర్గాలు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసి, వినియోగించుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మార్పు మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 08 May 2024 10:24 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఒప్పంద ఉద్యోగులు.. ఓటుకు పోటెత్తుతున్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు గంటల తరబడి ఎండల్లో నిరీక్షిస్తున్నారు. ఓటుకు రూ.3-5వేలు ఇస్తామని బేరాలాడుతున్న పార్టీ నేతలకు.. ‘మీ సేవలు చాలు.. చిత్తగించండి’ అని ముఖం మీదే తేల్చేస్తున్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఉద్యోగవర్గాలు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసి, వినియోగించుకోవడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో మార్పు మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు