Revanth Reddy: కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు భాజపా, భారాస కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్‌ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. 

Published : 09 Apr 2024 09:59 IST

కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మెజార్టీని తగ్గించేందుకు భాజపా, భారాసలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కొంతమంది కక్షగట్టి కాంగ్రెస్‌ను పడేయాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని నిలదీశారు. 

Tags :

మరిన్ని