Sangareddy: సంగారెడ్డి జిల్లా.. హెటిరో ల్యాబ్‌లో చిరుత కలకలం..!

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు నెహ్రూ జూ పార్క్‌ సిబ్బంది బంధించారు. ఉదయం 4గంటలకు ల్యాబ్‌ హెచ్‌ బ్లాక్‌లోకి చిరుత వచ్చింది. చిరుతను రాకను గమనించిన ల్యాబ్‌ సిబ్బంది బయటకు వచ్చి గదికి తాళం వేశారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నెహ్రూ జూపార్క్‌ ప్రత్యేక బృందం కూడా అక్కడికి చేరుకుంది. చిరుతను పట్టుకోవడానికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు 11గంటల సమయం తర్వాత చిరుతను బంధించేందుకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో చిరుత మత్తులోకి జారుకోగానే బోనులో బంధించారు. చిక్కిన చిరుతను అధికారులు జూపార్క్‌కు తరలించనున్నారు.

Updated : 17 Dec 2022 15:19 IST

Sangareddy: సంగారెడ్డి జిల్లా.. హెటిరో ల్యాబ్‌లో చిరుత కలకలం..!

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు నెహ్రూ జూ పార్క్‌ సిబ్బంది బంధించారు. ఉదయం 4గంటలకు ల్యాబ్‌ హెచ్‌ బ్లాక్‌లోకి చిరుత వచ్చింది. చిరుతను రాకను గమనించిన ల్యాబ్‌ సిబ్బంది బయటకు వచ్చి గదికి తాళం వేశారు. తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నెహ్రూ జూపార్క్‌ ప్రత్యేక బృందం కూడా అక్కడికి చేరుకుంది. చిరుతను పట్టుకోవడానికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు 11గంటల సమయం తర్వాత చిరుతను బంధించేందుకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. దీంతో చిరుత మత్తులోకి జారుకోగానే బోనులో బంధించారు. చిక్కిన చిరుతను అధికారులు జూపార్క్‌కు తరలించనున్నారు.

Tags :

మరిన్ని