CM Jagan: మద్య నిషేధం మరచి.. నిలువు దోపిడీ.. ప్రజల ఆరోగ్యంతో జగన్‌ రాక్షస వ్యాపారం

‘జే బ్రాండ్ల’ మద్యం విక్రయాల ద్వారా ప్రజల్ని పీల్చిపిప్పి చేసేసిన జగన్‌మోహన్‌రెడ్డి... అందులో సరికొత్త దోపిడీ పర్వానికి తెరలేపి తన సొంత బొక్కసాన్ని నింపుకున్నారు.

Published : 10 May 2024 10:49 IST

నిషేధం అని చెప్పి వరద పారించారు. బార్లకే పరిమితం చేస్తామంటూ ప్రభుత్వ దుకాణాలు బార్లా తెరిచారు. మద్యం ఎక్కడా కనిపించకుండా చేస్తానని చెప్పి గతంలో లేని చోట్లా అమ్మకాలకు అనుమతిచ్చారు. తయారు చేయడం దగ్గర నుంచి అమ్మకం వరకూ మొత్తం చెప్పుచేతల్లో పెట్టుకుని కమీషన్లు కొల్లగొట్టారు. దేశవ్యాప్తంగా దొరికే బ్రాండ్లను తరిమేసి పిచ్చి బ్రాండ్లు తెచ్చారు. విష రసాయనాలను పోలిన మందును పేదల గొంతులో పోసి ప్రజారోగ్యాన్ని పీల్చిపిప్పిచేశారు.! ఇలా మద్య నిషేధం హామీకి అడుగడుగునా తూట్లు పొడిచిన జగన్.. ఈసారి మ్యానిఫెస్టోలో ఆ హామీనే ఎత్తేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు