Dastagiri: నాపై రాళ్ల దాడికి వైకాపా కుట్ర.. అందుకే నామినేషన్‌ వాయిదా: దస్తగిరి

పులివెందులలో తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైకాపా (YSRCP) చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి (Dastagiri) ఆరోపించారు.

Published : 24 Apr 2024 11:51 IST

పులివెందులలో తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాల దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ఈరోజే నామినేషన్‌ వేస్తున్నారని.. ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందన్నారు. సీఎం జగన్‌ నామినేషన్‌ వేసినప్పుడే తానూ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని