మేం అలా చేసుంటే.. సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లోనే!: హరీశ్రావు
భారాస అధినేత కేసీఆర్కు పనితనం తప్ప పగతనం తెలియదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారాస కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. భారాస ప్రభుత్వం వచ్చిన వెంటనే హౌసింగ్ స్కామ్లో కేసులు పెట్టి ఉంటే.. సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని ఆరోపించారు. కష్టపడి సాధించిన తెలంగాణ కక్షలు, పగలతో ఇబ్బంది పడకూడదని, అభివృద్ధిపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు.
Updated : 13 Dec 2023 17:14 IST
Tags :