USA: పాకిస్థాన్ను హెచ్చరించిన అమెరికా
భారత్పై కవ్వింపులకు దిగితే అందుకు పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా పేర్కొంది. రెచ్చగొట్టే చర్యలు పాక్ చేస్తే ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత సైన్యం గట్టిగా బదులిస్తుందని తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ఇరుదేశాలు అణ్వాయుధాలు కలిగిఉండటంతో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులైనా దారితీయొచ్చని పేర్కొంది.ఇదే సమయంలో ఉగ్రవాదులతో పాక్ అంటకాగుతోందని తేల్చిచెప్పింది.
Published : 09 Mar 2023 14:22 IST
Tags :