TS News: రూటు మార్చిన మత్తు ముఠా.. గంజాయిని పొడిగా చేసి విక్రయం

గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టీఎస్‌న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక విభాగాలు హైదరాబాద్‌ నగరంలో ఎప్పటికప్పుడు మత్తు ముఠాల ఆటకట్టిస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్తదారుల్లో నగరానికి గంజాయి తీసుకొస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు.

Published : 18 Apr 2024 12:04 IST

గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. టీఎస్‌న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక విభాగాలు హైదరాబాద్‌ నగరంలో ఎప్పటికప్పుడు మత్తు ముఠాల ఆటకట్టిస్తున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్తదారుల్లో నగరానికి గంజాయి తీసుకొస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పొడిని పాలల్లో కలిపి తాగుతారని ఆ దుకాణం యజమాని తెలిపారు.

Tags :

మరిన్ని