Muthireddy: ప్రజల ముందే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిలదీసిన కుమార్తె

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy)ని ఆయన కుమార్తె తుల్జాభవానీ నిలదీశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే చేర్యాల భూ వివాదంపై ప్రశ్నించారు. తనకు తెలియకుండానే తన సంతకం ఫోర్జరీ చేసి, బెదిరించి ప్రాపర్టీ తన పేరిట రాయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తాను సంపాదించిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుందన్నారు. తన బిడ్డను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జనగామలోనే తన కట్టే కాలుతుందని, చితాభస్మం ఇక్కడి నియోజకవర్గంలోని చెరువుల్లో కలపాలని భావోద్వేగానికి గురయ్యారు. 

Updated : 19 Jun 2023 20:16 IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy)ని ఆయన కుమార్తె తుల్జాభవానీ నిలదీశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల ముందే చేర్యాల భూ వివాదంపై ప్రశ్నించారు. తనకు తెలియకుండానే తన సంతకం ఫోర్జరీ చేసి, బెదిరించి ప్రాపర్టీ తన పేరిట రాయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించారు. తాను సంపాదించిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుందన్నారు. తన బిడ్డను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జనగామలోనే తన కట్టే కాలుతుందని, చితాభస్మం ఇక్కడి నియోజకవర్గంలోని చెరువుల్లో కలపాలని భావోద్వేగానికి గురయ్యారు. 

Tags :

మరిన్ని