VandeBharat: తిరుపతి -సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..!

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)రైలులో మంటలు వచ్చాయి. దీంతో మనుబోలు రెల్వే స్టేషన్‌లోలో రైలును నిలిపి మంటలను ఆర్పివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి క్రిందికి దిగారు. రైల్లోని మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి మంటలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు. తాగి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వచ్చాయని, ప్లాస్టిక్ కారణంగా అవి బోగీలో వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని.. ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా సుమారు గంటపాటు రైలును నిలిపివేశారు.

Updated : 09 Aug 2023 19:18 IST

VandeBharat: తిరుపతి -సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..!

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)రైలులో మంటలు వచ్చాయి. దీంతో మనుబోలు రెల్వే స్టేషన్‌లోలో రైలును నిలిపి మంటలను ఆర్పివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి క్రిందికి దిగారు. రైల్లోని మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి మంటలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు. తాగి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వచ్చాయని, ప్లాస్టిక్ కారణంగా అవి బోగీలో వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని.. ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా సుమారు గంటపాటు రైలును నిలిపివేశారు.

Tags :

మరిన్ని