Dharmavaram: విద్యార్థులతో వైకాపా నేతల ర్యాలీ.. ఫ్లకార్డులు చించేసిన స్టూడెంట్స్

సత్యసాయి జిల్లా ధర్మవరంలో విద్యార్థులతో వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీ, సదస్సులో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ‘జగనన్నకు కృతజ్ఞత’ సభ నిర్వహించారు. ఈ సభలో MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొనగా.. రెండు గంటల పాటు ర్యాలీ, సభ నిర్వహించడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన వెంటనే విద్యార్థులంతా సీఎం జగన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్న ఫ్లకార్డులను చించి కింద పడేశారు. 

Updated : 13 Feb 2024 13:21 IST

సత్యసాయి జిల్లా ధర్మవరంలో విద్యార్థులతో వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీ, సదస్సులో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ‘జగనన్నకు కృతజ్ఞత’ సభ నిర్వహించారు. ఈ సభలో MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొనగా.. రెండు గంటల పాటు ర్యాలీ, సభ నిర్వహించడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన వెంటనే విద్యార్థులంతా సీఎం జగన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్న ఫ్లకార్డులను చించి కింద పడేశారు. 

Tags :

మరిన్ని