ఓటు వేసి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఓటు వేసి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్, కవిత భార్యాభర్తలు. వీరిద్దరు గురువారం స్థానిక సెయింట్ గాబ్రియేల్ పాఠశాలలో ఓటు వేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు అతి వేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఎంజీఎం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published : 01 Dec 2023 17:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు