బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 21:03 IST

హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మహమ్మద్‌ సమీర్‌ పేరును ఖరారు చేసింది. అలాగే, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావు పేర్లను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ఖరారు చేసింది. 

మరిన్ని

తాజా వార్తలు