ఆనందం చిరునామా
సంపదలు వస్తాయి, పోతాయి. సిరులు అన్నవి ఆర్థిక సామాజిక విలువలు మాత్రమే. సంపద చంచలమైందని అంటారు కదా... అదొక చోట నిలవదు. సిరులు పోయినా పోతాయి... కరి మింగిన
సంపదలు వస్తాయి, పోతాయి. సిరులు అన్నవి ఆర్థిక సామాజిక విలువలు మాత్రమే. సంపద చంచలమైందని అంటారు కదా... అదొక చోట నిలవదు. సిరులు పోయినా పోతాయి... కరి మింగిన వెలగపండులాగా. మనసులో ఉండాల్సిన నిశ్చింతకు ప్రసన్నతకు డబ్బుతో సంబంధమే లేదు. ఆనందంగా జీవించేవాడే అదృష్టవంతుడు. రేపటికి అవసరమైన డబ్బు మాత్రమే సంపాదించుకొని నిశ్చింతగా బతికేవాడు నిజమైన శ్రీమంతుడని అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు నిర్వచించాడు. ఆర్థిక స్థితిగతులు జీవితాన్ని ప్రభావితం చేయకూడదని అంటాడాయన.
ఆర్థిక ప్రయోజనాలతో జీవితాన్ని ముడిపెట్టుకొంటే... బతుకులో ఆనందం లభించదు. జీవితం సుఖప్రదంగా సాగాలనుకొంటే స్వేచ్ఛా జీవితంలోనే ఆనందం దొరుకుతుందని తెలుసుకోవాలి. సంపదలు సమస్యలకు నిలయాలని ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ రాసిన ఆర్గనోన్ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. అలాగని ధనాన్ని వదిలిపెట్టి దరిద్రంలో బతకమని కాదు. అవసరానికి తగినంత డబ్బునే సంపాదించాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మనిషిపై డబ్బు ప్రభావం ఉన్నంత కాలం మనసుకు నిజమైన సంతోషం లభించదు.
అయోధ్య రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం కావాలని దశరథుడు నిండు సభలో ఆజ్ఞాపించినప్పుడు రాముడి వదనంలో ఆనంద ఛాయలు వ్యక్తం కాలేదు. తండ్రి తనను రాజ్య భారం స్వీకరించాలని ఆదేశించినట్లుగానే దాశరథి భావించాడు. మరుసటి రోజు కైకేయి తనను పిలిపించి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని దశరథుడి ముందే ఆజ్ఞాపించినప్పుడు... శ్రీరాముడు అప్పుడు సైతం తండ్రి ఉత్తర్వుగానే పరిగణించి ఆయన మాట నిలబెట్టేందుకు కృతనిశ్చయుడయ్యాడు. ఆ సందర్భంలో ఆయన ముఖవైఖరిలో నిరాశ ఛాయలు కనిపించలేదు.
సీతారామలక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని ఉన్నప్పుడు లక్ష్మణుడు అన్నను ప్రశ్నించాడు. అధికారం చేతికందుతున్నప్పుడు సంతోషం ఎందుకు కనపడలేదు... అది చేజారినప్పుడు వేదన ఎందుకు వ్యక్తం కాలేదని అడిగాడు. అందుకు శ్రీరాముడు బదులిస్తూ- ‘సౌమిత్రీ! ఈ విశ్వాన్నంతా గమనించావా? పశువులు పక్షులు చెట్లు ఏ అధికార సంపదల బలంతో సంతుష్టిగా జీవిస్తున్నాయి? సిరిసంపదలు, అధికారం లేకుండా జీవించలేని వ్యక్తిత్వం మనోవైకల్యం లాంటిదే. సకల జీవరాశులకు లేని ఆ దౌర్బల్యం మనిషికి ఎందుకు ఉండాలి చెప్పు...’ అన్నాడు మనిషి రూపంలో ఉన్న ఆ దైవం.
సంతోషంగా ఉండేవాడిలో కక్షలు, కార్పణ్యాలు కనిపించవు. ఇతర ఏ పట్టింపులూ ఉండవు. డబ్బుతో అధికారంతో ప్రమేయం ఉండదు. నిజానికి వారికి శత్రువులే ఉండరు. కొందరు ఎన్ని కష్టాలనైనా అవలీలగా భరిస్తారు. అనారోగ్యం సంసార బాధ్యతలు ఒంటరితనం లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉల్లాసంగా కనిపిస్తారు. మంచి అలవాట్లు జీవనశైలి సైతం సంతోషాన్నిస్తాయి. భూటాన్ రాజ్యం ధనిక దేశం కాదు. కానీ, అక్కడి ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారట. చాలావరకు వారంతా వజ్రయాన బౌద్ధులు. తొలి శతాబ్దంలో భారతదేశం నుంచి భూటాన్ వెళ్ళిన బౌద్ధ సన్యాసి పద్మసంభవుడు వారికి గురువు. ఆనందంగా జీవించడంలో దైవత్వం ఇమిడి ఉందని ఆయన చెప్పిన సూత్రాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. అలాంటి జీవన విధానాలనే పాటిస్తారు. ఆనంద స్థితిని అందుకోవడం కష్టతరం కాదని బుద్ధుడి తొలి శిష్యుల్లో ఒకడైన ఆనందుడు రాసిన దమ్మమార్గం చెబుతోంది. ఆనందం అంతరాంతరాళాల్లోంచి ఉబికి వచ్చేది. ఆ అనుభవానికి మరే ఇతర లౌకిక ఊరటకు సంబంధం లేదు. అదొక మధురానుభూతి.
- అప్పరుసు రమాకాంతరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!