ప్రకృతితో సహజీవనం
ఆహార నిద్రా భయ మైథునాలే జీవన కార్యకలాపాలనే స్థితిని దాటి మనిషి సృజనాత్మక శక్తితో నాగరికుడయ్యాడు. జనావాసాలు గ్రామాలయ్యాయి. వ్యవసాయం పెంపొందింది. నైపుణ్యాల ఆధారంగా పలు వృత్తులూ ఏర్పడ్డాయి. విజ్ఞానం పెరిగింది. విశ్వాసాలూ పెరిగాయి.
ఆహార నిద్రా భయ మైథునాలే జీవన కార్యకలాపాలనే స్థితిని దాటి మనిషి సృజనాత్మక శక్తితో నాగరికుడయ్యాడు. జనావాసాలు గ్రామాలయ్యాయి. వ్యవసాయం పెంపొందింది. నైపుణ్యాల ఆధారంగా పలు వృత్తులూ ఏర్పడ్డాయి. విజ్ఞానం పెరిగింది. విశ్వాసాలూ పెరిగాయి. సుఖజీవనానికి అవసరమైన పరికరాలను, సాధనాలను రూపొందించుకున్నాడు. ఈ స్థితిలో మనిషి తాను ప్రకృతిని నియంత్రించగలనన్న అహానికి లోనయ్యాడు.
ప్రకృతి శక్తులన్నీ మనిషికి ఉపకరించేవే. నదులు, సముద్రాలు, పర్వతాలు, మైదానాలు, వృక్షాలు, జీవకోటి- ఇవన్నీ ప్రకృతిలోని భాగాలే. ప్రకృతిలోని ఉత్పత్తులు, వాటిని వినిమయం చేసుకోవడం నిమిత్తంగా ధనం ఆవిష్కృతమై అదే ప్రధాన వనరుగా మారింది. ఉత్పాదక శక్తి ధనానికి లొంగిపోయింది. కూడబెట్టిన ధనంతో ప్రతిదానికి ఆ రూపంలోనే విలువకట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనిషి అవసరాలకు, వనరులకు మధ్య సమన్వయం, సంతులనం ఉండేవి.
మనిషికి మట్టి ఆధారం. ఆ నేల, వర్షం కురిసిన నేల, నీరింకిన నేల- చెట్టుచేమలకు, జంతువులకు, మనిషికి బతుకులకు మూలమైంది. నేలను, చెట్టును కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయనే తెలివితో మనిషి మనుగడ సాగిస్తూ వచ్చాడు. వర్షం కురిస్తే హర్షంతో చిందులేసేవాడు. అడవి తల్లికి దండాలని పాడుకున్నాడు. వనదేవత అనే భావననూ సృష్టించుకున్నాడు. కర్రను, కలపను వంటచెరకుగాను, పనిముట్లుగాను మలచుకున్నాడు. ఆహారం కోసం కొన్ని జంతువుల్ని, ప్రాణ రక్షణ కోసం మరికొన్నింటిని చంపడం తప్పనిసరయింది. నాగరికత విస్తరించే క్రమంలో పండిన పంటలతో, ఎండిన చెట్లతో అవసరాలు తీర్చుకునే దశనుంచి పచ్చని చెట్టు మీదకు మనిషి దృష్టి మళ్ళింది. పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడనన్నాళ్లు ప్రకృతితో సహజ సహకార జీవనం విలసిల్లింది. నేలకూడా మనిషికి సహకరించింది. చెట్ల నుంచి, జంతువుల నుంచి వచ్చే సహజమైన ఎరువులు, తనలో ఉండే వానపాముల్లాంటి ప్రాణుల సాయంతో మనిషికి ఆహారం అందించింది. మనిషి మాత్రం నేలను నిస్సారం చేయసాగాడు. వృక్షాలు, పశుపక్ష్యాదులు పరిధుల్లోనే ఉంటాయి. రుతువుల పరిభ్రమణంలో ఆకులు ఎండటం, రాలడం, మళ్ళీ వసంతంలో పూత- ఇదంతా సహజ ప్రక్రియ. జంతువులు, పక్షులు ఎప్పటికప్పుడు తినడానికి కావలసినంత ప్రకృతినుంచి తీసుకుంటాయి. రేపటికి నిలవ చేసుకోవడం ఉండదు. మనిషి అలాకాదు. మూడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి కూడబెట్టాలనే స్వార్థం, అది నెరవేర్చుకోవడానికి క్రౌర్యం... ఈ దుర్గుణాలతో మనిషి జీవనం సాగుతోంది. నేటి తనలాభం కోసం రేపటి తరాన్ని బలివ్వడం మనిషికే చెల్లింది. పంట భూములు జనారణ్యాలవుతున్నాయి. తరతరాలుగా మట్టి మీద మమకారం పెంచుకున్నవాడు వ్యాపార మాయాజాలంలో చిక్కుకొని- నమ్ముకున్న నేలకు దూరమవుతున్నాడు.
సౌకర్య సాధనాల విశృంఖల వినియోగం, అత్యాశతో సంపదను పోగుచేసుకోవడం, దాచుకున్నదాన్ని రక్షించుకునే యత్నంలో భయాందోళనలు... మనిషికి హానికారకాలవుతున్నాయి. వ్యక్తికి సమాజానికి, మనిషికి ప్రకృతికి నడుమ ఒక సామరస్యాన్ని కాపాడే ధర్మాన్ని పౌరులు ఆచరించాలి. ప్రకృతిపట్ల జడభావాన్ని తొలగించుకొని, ఏకాత్మభావన పెంపొందించుకొని విశ్వలయను కాపాడవలసిన బాధ్యత మానవ సమాజంపై ఉంది.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్