దేవుడున్నాడా?
భౌతిక ప్రపంచం కారణం లేని అభూతకల్పన కాదు. దాన్ని సృష్టించింది దేవుడన్న నమ్మకంతో జీవించే మనుషులే అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేవుడు లేడనేవారు అదే ప్రపంచంలో నివసిస్తారు.
భౌతిక ప్రపంచం కారణం లేని అభూతకల్పన కాదు. దాన్ని సృష్టించింది దేవుడన్న నమ్మకంతో జీవించే మనుషులే అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేవుడు లేడనేవారు అదే ప్రపంచంలో నివసిస్తారు.
జ్ఞానులు, వేదాంతులు వారెక్కడివారైనా సృష్టిలోని పునాదులన్నీ దేవుడు వేసినవేనని సూత్రప్రాయంగా అంగీకరిస్తారు. మతాలన్నీ దేవుడిని విశ్వాత్మగా, విశ్వసంభవానికి మూలకారణమైన దివ్యశక్తిగా గుర్తించాయి. గ్రహాలన్నీ గతి తప్పకుండా తమ పరిధిలో సంచరించడాన్ని సాధ్యం చేస్తున్నది ఊహకు అందని ఒక దివ్యశక్తేనని విశ్వ రహస్యాలను శోధించే శాస్త్రజ్ఞులు చెబుతారు. ఆ శక్తిని దేవుడనడానికి మాత్రం సుముఖత చూపరు. దేవుడిని నమ్మశక్యంగాని జ్ఞానమని కితాబులిచ్చి ఊరుకుంటారు కాని అతడున్నాడనరు.
వేదాంతులొక్కరే దేవుడున్నాడని మనిషికి నిర్దుష్టంగా చెబుతారు. అతడు అతడిలోనే దివ్యాత్మగా ప్రతిష్ఠుడై ఉంటాడని అర్థమయ్యేందుకు చిన్న కథొకటి చెబుతుంటారు. ఆ కథలో దేవుడి ఉనికిని ప్రశ్నించే కొందరుంటారు. నిత్యం కళ్లు మూసుకుని జ్ఞానముద్రలో కనపడుతుండే సాధుపురుషుడొకరిని చూసినప్పుడల్లా, వారు ప్రశ్నలు అడిగేవారు. ఎందుకు మీకింత ప్రయాస... దేవుడిని చూడాలనా, ఉంటే ఆయన ఉండేది ఎక్కడ, ఎంతకాలానికి కనిపిస్తాడంటూ ప్రశ్నలడుగుతూ ధ్యానభంగం కావించేందుకు ప్రయత్నించేవారు. సాధువు మౌనంగా వారి మాటలు వినీవిననట్లు ఊరుకునేవాడు. ఒకనాడు వారంతా అతడిని మీకు వినికిడి లోపం కూడా ఉన్నట్లుంది అంటూ మితిమీరి పరిహసిస్తారు. అప్పుడు సాధువు బదులిస్తాడు- ‘దేవుడున్నాడు. మీలోనే ఉన్నాడు. చూడాలని సంకల్పముంటే చాలు కనపడి తీరతాడు. ఆయనెవరో మీకు చెప్పాలంటే, తోలుబొమ్మలాటను మీరు చూసే ఉంటారు కదా... ఆ బొమ్మలనాడించే వ్యక్తి ఎవరో నాకు చెప్పాలి’ అంటాడు. సాధువును పరిహసించే ఆ వ్యక్తులు, జ్ఞానులకు రావాల్సిన సందేహమా అది, తెరవెనక కూర్చుని బొమ్మలాడిస్తున్న అతడు కాదా అని నవ్వుతారు. అందుకు ఆ సాధువు.... తెరవెనక నుంచి బొమ్మలనాడిస్తున్న ఆ వ్యక్తిలాగా తోలుబొమ్మల వంటి మనుషులను నడిపించేవాడు దేవుడు అంటాడు. తెర తొలగించుకుంటే మీకు కనిపిస్తాడంటూ తిరిగి ధ్యానావస్థలోకి జారుకుంటాడు! మనిషి నమ్మకమే దేవుడు. అరిషడ్వర్గాలు వేసిన ముసుగులో పడిన లోక భ్రాంతి తొలగినప్పుడు కానీ మనిషి తనలోనే ఉన్న ఆ దేవుడిని చూడలేడని వివరించడానికి వేదాంతులు చెప్పే కథ ఇది.
దేవుడు విద్యుచ్ఛక్తి లాంటివాడు. విద్యుత్తును ఒకసారి చూపమని అడిగితే ఎవరూ చూపించలేరు. విశాల విశ్వంలో సంభవించే నిరంతర పరిణామాలకు కారణమవుతున్నది, మనిషి మేధ అందుకోలేకపోతున్న అజ్ఞాతశక్తి- ఒకటే. గాలిలోని ప్రాణవాయువు జీవి కళ్లకు కనపడనంత మాత్రాన లేకుండా పోదు. దాన్ని జీవశక్తిగా నమ్ముతున్నప్పుడు జీవులకు ప్రాణం పోస్తున్న ఆ శక్తిని దేవుడనడానికి అభ్యంతరం ఉండకూడదు.
దేవుడు లేడనేవారి మనోభావనలను నిరసించి గాయపరచడాన్ని హైందవ సనా తన ధర్మం ఎన్నడూ ఆమోదించలేదు. ఉన్నాడని చెప్పేందుకు తార్కిక వాదనలను వినిపించింది. దేవుడంటే ఎవరేది చెప్పినా వినగల సహనం నేర్పించింది. చార్వాకుడి నాస్తిక వాదాన్నీ కించపరచలేదు. రుషులకిచ్చిన గౌరవమే ఆయనకు ఇచ్చింది.
విశ్వమంతా నిండి ఉన్న చైతన్యమంతా దేవుడేనని, అతడు రూపగుణ విశేషాలుండని తనలోనే ఉన్న దివ్య చైతన్యమని, అందులో తానొక అణువులో అణుమాత్రమైనా కాని అంశమని వేదాంతం తెలుసుకొమ్మంటుంది. వేదాంతం అర్థమైతే... దేవుడంటే వెలుగని గ్రహించి- భౌతిక లోకంలో చీకట్లు తనను ఏ రూపంలో వేధిస్తున్నా మనిషి భయపడడు!
- జొన్నలగడ్డ నారాయణమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు