ఇది చాలదా?
అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని... అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి.
అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని... అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటికి అంతు ఉండదు. హద్దుండదు. అన్నీ దొరికినా, సుఖంగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడా అంటే- అదీ ఉండదు. ఇవన్నీ సమకూరాక ‘స్వామీ! నాకు సుఖశాంతులు లేవు. ఆనందం లేదు. అవి కావాలి, ప్రసాదించు!’ అని కోరుకుంటాడు పరమాత్మను. ఇది అమాయకత్వం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా?
సుఖశాంతులనేవి మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట, ఆచరించే వ్యవహారం మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నింటికీ మూలం ధర్మం. ధర్మాచరణ చేసేవాడు సంతోషంగానే ఉంటాడు. సంతోషం అంటే సంతృప్తి. సమయం, మాట, ఆలోచన, ఆచరణాల విలువ తెలిసినవాడు కచ్చితంగా సంతోషంగానే ఉంటాడు.
సంతోషం ఒకచోట లేనప్పుడు, మరోచోట దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు దొరక్కపోయినా మరొకప్పుడు దొరుకుతుంది. అందుకు సంయమనం అవసరం. ఓర్పు, ఓపిక అవసరం. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు ఎప్పుడూ సంతృప్తి పొందుతూనే ఉంటాడు. అక్రమంగా, అవినీతి మార్గంలో ధనార్జన చేసినవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. అటువంటివాడికి సుఖం దొరకదు. శాంతీ లభించదు.
అత్యాశాపరులు రావణుడు, దుర్యోధనుడు ఎలాంటి దుర్గతిని, అపఖ్యాతిని పొందారో విదితమే. అహంకారి హిరణ్యకశిపుడు హరిని దూషించి నరహరి చేత నిహతుడయ్యాడు. ధర్మం తప్పినవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండలేడు. భయం అనే పిశాచి అతణ్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది.
సత్త్వరజస్తమోగుణాలతో సత్త్వగుణ శోభితుడైన మనిషి సర్వదా సంతుష్టుడై ఉంటాడని గీతాచార్యుడు చెప్పాడు. సాధువర్తనుడికి భయమే ఉండదు. ఐశ్వర్యవంతుడికి సంపద పోతుందేమోనని భయం. పదవిలో ఉన్నవాడికి పదవి పోతుందేమోనన్న భయం. కీర్తి కాంక్ష కలవాడికి ఎప్పుడు అపఖ్యాతిని పొందుతానోనన్న భయం. మమకార అహంకారాలున్న వాడికే ఈ భయాలు. ‘ఎదురుదెబ్బలు తగిలినా, సాధించాలనుకున్నది సాధించి సఫలీకృతుడయ్యేవాడే సంతోషానికి అర్హుడు’ అంటాడు చాణక్యుడు. సంతుష్టిని, ఆనందాన్ని బయటి నుంచి పొందాలనుకునేవాడు లౌకికుడు. ఆ ఆనందాన్ని తనలోనే అన్వేషించుకోగలిగేవాడు ఆత్మజ్ఞాని. ఇంకా ఏదేదో కావాలనుకుంటూ తపిస్తూ, అశాంతిగా సంక్షోభంలో సంఘర్షణలో కొట్టుమిట్టాడేవాడు ఎన్నటికీ సంతృప్తి పొందలేడు. ‘కలిసి పంచుకుందాం... కలిసి భుజిద్దాం, కలిసి నడుద్దాం’ అన్న ఉపనిషత్ వాక్యం సంతోష మార్గానికి సరైన దిక్సూచి. ‘తృప్తి కలిగితే సుఖం, తృప్తి తొలగితే దుఃఖం. తృష్ణ పెరిగితే దుఃఖం, తృష్ణ తగ్గితే సుఖం’ అన్నది మనుస్మృతి.
మునులు, యోగులు, అవధూతలు మనకు తమ కృతుల ద్వారా అమూల్యమైన జ్ఞాన భాండాగారం అందించారు. జిజ్ఞాస ఉండాలే కాని, వాటిని అధ్యయనం చేస్తే సచ్ఛీలురైన పౌరులం కాగలం. ఇది చాలదా? పరమాత్మ పంచభూతాత్మకమైన సృష్టిని ప్రసాదించాడు. సద్వినియోగపరచుకుంటున్నామా? అపూర్వ ఆవిష్కరణలు చేయగల మేధావులకు ఈ తపో భూమి మీద పుట్టుకనిచ్చాడు... లోక శ్రేయస్సు కోసం. ఇది చాలదా? ఇతర ప్రాణికోటికి లేని మనసు, మేధ ఇచ్చాడు... జగతి ప్రగతికోసం! ఇది చాలదా? ‘చాలదా హరి నామ సౌఖ్యామృతము మనకు’ అని ఏనాడో అన్నమయ్య భక్త కోటిని ప్రశ్నించి, హెచ్చరించాడు. వేటినీ సద్వినియోగపరచుకోలేక, అన్నీ వ్యాపారాత్మకం చేసి స్వార్థానికి వాడుకుంటున్నాం. మనకు యోగ్యత ఉంటే దైవకృప ఏదైనా చేతికందిస్తుంది. యోగ్యత లేకపోతే ఎంత వాపోయినా ఫలితం దక్కదు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.