ఉత్తమ భూషణం
‘కామ క్రోధాదులు మనిషి వెన్నంటి ఉండే దుర్గుణాలు. వాటిని సహనంతో వదిలించుకొని ముందుకు నడిచే మనిషే మనీషి అవుతాడు’ అని పురాణ సాహిత్యం చెప్పింది.
‘కామ క్రోధాదులు మనిషి వెన్నంటి ఉండే దుర్గుణాలు. వాటిని సహనంతో వదిలించుకొని ముందుకు నడిచే మనిషే మనీషి అవుతాడు’ అని పురాణ సాహిత్యం చెప్పింది. ‘అలా మహాత్ముడిగా మారాలంటే ఎంతో చాకచక్యం అవసరం’ అనీ అది సూచిస్తోంది. ఇలా అనడానికి కారణం మానవ నైజం. ఎవరైనా తనకు నచ్చినట్లు ప్రవర్తించకపోతే వెంటనే కోపం వస్తుంది. కోపం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది. అందువల్ల ఇంగితాన్ని కోల్పోతాం. ఆవేశాన్ని దిగమింగుకొని సంయమనంతో ఆలోచించి సహనంగా ప్రవర్తించి నిర్ణయం తీసుకునే శక్తి రావడానికి చాలా సాధన కావాలి.
ఉత్తముడికి కోపం క్షణంలో మాయమవుతుందట. మధ్యముడి కోపం ఓ ఘడియ వరకు, అధముడికి ఒక రాత్రి పగలు వరకు, పాపిష్ఠివాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట. మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసంలా వదిలిపెట్టాలి. భగభగ మండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి. అది చెప్పినంత సులువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవరచుకోవాలి. ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు. తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టే రాముడి కథ ఇన్ని యుగాల తరవాతా మనకు ప్రాతఃస్మరణీయమైంది. భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం, సంయమనం వంటి లక్షణాలను అలవరచుకోవడాన్ని సాధన చేయవచ్చు.
ధర్మరాజు దుర్యోధనుడి కొలు వులో జూదం ఆడేటప్పుడు, అజ్ఞాతవాస సమయంలోను ఎప్పుడో ఒకప్పుడు సహనం కోల్పోయి ప్రవర్తించి ఉంటే దాని పర్యవసానం ఏ విధంగా ఉండేదో ఊహించవచ్చు. హనుమంతుడు సీతాన్వేషణలో సముద్రాన్ని దాటే క్రమంలో సురస అనే అతి భయంకర రాక్షసి అడ్డగించినప్పుడు ఎంతో సంయమనంతో చేతులు జోడించి ‘సీతామాతను వెతుకుతూ వెళ్తున్నాను... దారివ్వు తల్లీ’ అని ప్రార్థించాడు. మాట వినని సురస నోటి నుంచి తన శరీరాన్ని అంగుష్ఠమాత్రంగా చేసి లోపలికి వెళ్ళి అంతే వేగంతో బయటకి వచ్చి వినయంగా ఆమెకు చేతులు జోడించాడు. ఆంజనేయుడి సౌమ్యతకు, సహనానికి సురస ఆనందించి ఆశీర్వదించింది. రావణుణ్ని అంగీకరించకపోతే చంపి తినేస్తామని బెదిరించిన రాక్షస స్త్రీల హింసలను ఓర్పుతో భరించి, సీత రాముడి కోసం ఎదురుచూసింది. అందుకనే భూమాతకు ఉన్న ఓర్పు ఆమె కుమార్తె సీతమ్మకుంది అంటుంది రామాయణం.
విత్తు నాటిన మరునాటి నుంచే ఫలసాయం కోసం ఎదురు చూడటం ఎంతవరకు సమంజసం? దానికి నీరు అందించి, చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా వంటివారి చరిత్రలు చదవడం ద్వారా ఓర్పు, సహనాలను అలవరచుకోవచ్చు.
సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు. కానీ, లోకంలో ఉత్తములైనవారు ఓర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు. కొంత సమయం ఓర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉంది. ఇదే విషయాన్ని బోధించే విధంగా ‘దాంతునికైనా వేదాంతునికైనా దార, సుతులు, ధన ధాన్యములుండినా, సారకు జపతప, సంపద కలిగినా శాంతమూ లేక సౌఖ్యము లేదు’ అంటాడు త్యాగయ్య. అందుకనే ఈ లోకంలో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండాల్సిన ఉత్తమ భూషణం- ఓర్పు.
గంటి ఉషాబాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు