క్షేత్ర మాహాత్మ్యం
భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పేరుతో ఒక అధ్యాయం ఉంది. భగవానుడు పార్థుడితో ‘ఈ శరీరం క్షేత్రం. దీన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాల్లోనూ క్షేత్రజ్ఞుణ్ని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం’ అని పలికాడు. క్షేత్రమంటే నేల అని సాధారణమైన అర్థం.
భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పేరుతో ఒక అధ్యాయం ఉంది. భగవానుడు పార్థుడితో ‘ఈ శరీరం క్షేత్రం. దీన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రాల్లోనూ క్షేత్రజ్ఞుణ్ని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం’ అని పలికాడు. క్షేత్రమంటే నేల అని సాధారణమైన అర్థం. పరమాత్మ శరీరాన్ని క్షేత్రంగా చెప్పాడు. ఇంకా పై స్థాయిలో పరిశీలిస్తే సంస్కార బీజస్థానమైన మనసూ క్షేత్రమే. ఈశ్వరుడికి ఆవాసయోగ్యమైన ఈ జగత్తంతా క్షేత్రమే. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుల స్థితిని మానవుడు అర్థం చేసుకోవాలని అదే జ్ఞానమని పండితులు చెబుతారు. కర్మక్షేత్రమైన ఈ భౌతిక ప్రపంచమే ప్రకృతి అని, దాన్ని అనుభవించే జీవి పురుషుడని, ఈ రెండింటికీ పైన ఉండే నియంత దేవదేవుడని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతోంది. క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు పరమ పురుషుడు. అతడే సర్వేశ్వరుడు లేదా పరమాత్మ. బృహదారణ్యకం ప్రకారం పరమాత్మకు పృథివి శరీరం. అదే క్షేత్రం.
‘నేనే క్షేత్రజ్ఞుణ్ని’ అని ప్రకటించిన పరమాత్మ అంతటా ఉన్నా కొన్ని క్షేత్రాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తాం. కొన్ని క్షేత్రాలు స్వయంసిద్ధం. మరికొన్ని సిద్ధపరుషులు, రుషులు ప్రతిష్ఠించినవి. ఆగమశాస్త్ర విధులను అనుసరించి మానవులు ప్రతిష్ఠ చేసినవి కొన్ని క్షేత్రాలు. క్షేత్రం, తీర్థం, దైవం అనే త్రిపుటి- క్షేత్రానికి ఆధారం.
ఆయా క్షేత్రాలకు కొన్ని ప్రత్యేక మహిమలుంటాయి. శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే, వారణాసిలో మరణిస్తే, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని విశ్వాసం. అరుణాచల, సింహాచల క్షేత్రాల్లో గిరి ప్రదక్షిణం సంప్రదాయం. క్షేత్రదర్శనంలో తీర్థస్నానమూ ప్రశస్తమే. కాశీలో గంగ, తిరుపతిలో స్వామి పుష్కరిణి, శ్రీరంగంలో కావేరి... ఈ విధంగా ఆయా క్షేత్రాల్లో నెలకొన్న తీర్థాల్లో స్నానానికి భక్తులు ఎంతో ప్రాముఖ్యం ఇస్తారు.
స్కాంద పురాణం క్షేత్ర మహిమలకు ఆలవాలం. తెలుగు సాహిత్యంలో క్షేత్ర మాహాత్మ్యం ఒక ప్రక్రియ. ఎఱ్ఱాప్రగడ రచించిన శ్రీలక్ష్మీ నృసింహావతారం తెలుగులో తొలి క్షేత్ర మాహాత్మ్య కావ్యం. ఇది నృసింహ పురాణంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మాండ పురాణంలో నరసింహావతార కథను అనుసరించి అహోబల క్షేత్ర మాహాత్మ్యాన్ని కవి ఈ గ్రంథంలో వర్ణించాడు. అనంతర కాలంలో శ్రీనాథుడి భీమేశ్వర పురాణం, కాశీ ఖండం వెలువడ్డాయి. స్కాంద పురాణంలోని ఆయా క్షేత్రాల గాథల్ని శ్రీనాథుడు ఆంధ్రీకరించాడు. ద్రాక్షారామ భీమేశ్వర ప్రతిష్ఠకు సంబంధించిన కావ్యం భీమేశ్వర పురాణం. కాశీని శపించబోయిన వ్యాసుడిపై కోపగించి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళమని ఆ మహర్షిని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అన్నపూర్ణాదేవి దక్షిణ కాశి అయిన ద్రాక్షారామానికి వెళ్ళమని ఉపదేశిస్తుంది. ద్రాక్షారామం నుంచి వస్తున్న అగస్త్యుడు పిఠాపురం వద్ద వ్యాసుణ్ని కలుసుకుంటాడు. ఆ సందర్భంలో అగస్త్యుడు ద్రాక్షారామ క్షేత్ర వైభవాన్ని వ్యాసుడికి వివరిస్తాడు. కాశీ క్షేత్రానికి సంబంధించిన పలు గాథలు కాశీఖండంలో చోటు చేసుకున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ధూర్జటి సువర్ణముఖి నదీతీరంలోని శ్రీకాళహస్తి మాహాత్మ్యాన్ని కావ్యంగా రచించాడు. మహారాష్ట్రలోని భీమరథీ తీరంలోని పుండరీక క్షేత్ర మహిమల్ని తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మాహాత్మ్యంలో చిత్రించాడు. శైవక్షేత్రాల్లో జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రసిద్ధం. వైష్ణవ సంప్రదాయం దివ్యతిరుపతులనే క్షేత్రాలను పేర్కొంటున్నది. ఆయా క్షేత్రాల స్థల పురాణాల్ని, అక్కడ కొలువైన దేవుడి లీలావైభవాలను తెలుసుకోవడానికి క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు బాగా ఉపకరిస్తాయి.
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!