భీష్మాచార్యుడు
శంకరాచార్యులను ‘శంకర భగవత్పాదులు’ అన్నట్లుగానే- భీష్మాచార్యుణ్ని ‘భీష్మ పితామహుడు’ అనడం లోకంలో పరిపాటి. ఆస్తికులందరూ తమతమ పితృదేవతలకు విడిచినట్లుగా- ఏటా మాఘమాసంలో భీష్ముడికీ తర్పణాలు వదులుతారు.
శంకరాచార్యులను ‘శంకర భగవత్పాదులు’ అన్నట్లుగానే- భీష్మాచార్యుణ్ని ‘భీష్మ పితామహుడు’ అనడం లోకంలో పరిపాటి. ఆస్తికులందరూ తమతమ పితృదేవతలకు విడిచినట్లుగా- ఏటా మాఘమాసంలో భీష్ముడికీ తర్పణాలు వదులుతారు. ఈ శాస్త్రవిధిని గురించి ఆలోచిస్తే, ఆయనను పితామహుడని సంబోధించడంలోని ఔచిత్యం బోధపడుతుంది.
తండ్రి మాట జవదాటకపోవడంలో రామచంద్రుడు అగ్రగణ్యుడు. కాని, దాని నిమిత్తం ఆయన రాజ్యాన్నే తప్ప దాంపత్య జీవితాన్ని వదులుకున్నవాడు కాదు. అంతే కాదు, రావణాసుర సంహారం దరిమిలా రాముడు చిరకాలం రాజ్యపాలన నిర్వహించాడు. భీష్ముడు మాత్రం తండ్రి కోసం ఆజన్మాంతం అటు రాజ్యాన్ని, ఇటు వివాహాన్ని రెండింటినీ విడిచి పెట్టేశాడు. ఇలా ఒక అవతారమూర్తితో సరితూగే వ్యక్తిత్వం, పోల్చదగిన స్థాయి- మన పురాణాల్లో ఒక్క భీష్మపితామహుడికే దక్కింది. ఆ మాటకొస్తే, మహాభారతంలో సైతం పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడితోను, ధర్మస్వరూపుడైన ధర్మనందనుడితోను సరిసమానుడు అనిపించుకొన్న కర్మయోధుడు- భీష్ముడు ఒక్కడే! నందగోపాలుడు నరుడు కాదని, నారాయణుడని స్పష్టంగా గ్రహించిన సమకాలీనుల్లోనూ భీష్ముడే అగ్రగణ్యుడు. ఆ విషయాన్ని ఆయన భారతంలో అనేక చోట్ల స్పష్టంగా ప్రస్తావించాడు. శిశుపాల, సుయోధనాదులను హెచ్చరించాడు. తన పలుకుల ద్వారా కృష్ణతత్వాన్ని ఈ లోకానికి విశదీకరించాడు. అంత్య దశలో సైతం అంపశయ్యపై పడుకొని ఆయన ఆలోచన చేసింది- కబళిస్తున్న మృత్యువు గురించి కాదు, కరుణిస్తున్న కృష్ణుడి గురించి! తన నోట ఆయన పలికిస్తున్న తీరు గురించి!
ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిఉన్న భీష్మపితామహుణ్ని సమీపించి కృష్ణుడంతటి వాడు ‘ఓ నృపాల మహోత్తర’ అంటూ గొప్పగా సంబోధించాడు. వాస్తవానికి భీష్ముడు ఏనాడూ ఏలిక కాడు. అయినా నరులను పాలించిన వారిలో అత్యంత మహనీయుడిగా, శ్రేష్ఠుడిగా ఆయనను శ్రీకృష్ణుడు సంభావించాడు. ‘ఈ ధర్మరాజు దుఃఖంలో మునిగి ఉన్నాడు. ఇతడికి కర్తవ్య ఉపదేశం చేసి కలతను పోగొట్టు’ అని ఆదేశించాడు. దానికి ఫలితంగా భారతంలో రెండు పర్వాలకు నిండుగా భీష్ముడి ఉపదేశం లోకానికి అందింది. అనంత ధర్మరాశి అందులో ఒదిగిపోయింది. రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు... ప్రవాహంలా ఆయన నోట వెలువడ్డాయి. వాస్తవానికి అదంతా మానవాళికి మహోపదేశం. భీష్మ ధర్మజ సంవాదం చక్కగా అర్థం అయినవారికీ ధర్మజుని వలే హృదయం విప్పారుతుంది. ధర్మ సూక్ష్మం బోధపడుతుంది. అది లోకానికి భీష్ముడు చేసిన మహోపకారం.
మహాభారతంలోని శాంతి, ఆనుశాసనిక పర్వాలు రెండింటినీ లోతుగా అధ్యయనం చేస్తే తప్ప- మనకు భీష్ముడి తపోవిశేష మహనీయతతో, ఉదాత్తతతో సరైన పరిచయం ఏర్పడదు. ఈ లోకం ఆయనకు ఎంతగా రుణపడి ఉందో అర్థం కాదు. ఈనాటికీ ఆయనకు తర్పణాలు విడవడంలోని ఔచిత్యం తెలిసిరాదు. ‘భారత వీరుల్లోనే కాదు, ఇతరత్రాను అలాంటి మహనీయుడు లేనే లేడు’ అన్నారందుకే ‘కథలు-గాథలు’లో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.
శ్రీకృష్ణుణ్ని అవతారమూర్తిగా గుర్తించడంలో భీష్ముడికి తోడ్పడినవి- ఆయన చర్మ చక్షువులు కావు, వివేకం అనే మూడో కన్ను! దాన్నే జ్ఞాననేత్రం అన్నారు. ఆ భీష్ముడి ఉపదేశంతో మనకు జ్ఞాననేత్రాలు తెరుచుకోవాలి. ఆయన కళ్లలోంచి మనం పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయాలి. భీష్మ ఏకాదశి నాటి ఈ సంకల్పమే- ఆ మహాపురుషుడికి సరైన నివాళి అవుతుంది!
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు