అసలు కథ
‘మరణం సంభవించే క్షణం’ అనే విషయమై చాలా ఏళ్ల క్రితం ఓంటారియో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది. గమనించిన అంశాలను వారు మాంట్రియల్ గెజిట్లో ప్రకటించారు. గుండె కవాటాల మార్పిడిలో అత్యంత నిపుణుడిగా పేరొందిన డాక్టర్ విల్ఫ్రెడ్ జి.బ్రెజిలో వాటిని సోదాహరణంగా వివరించారు.
‘మరణం సంభవించే క్షణం’ అనే విషయమై చాలా ఏళ్ల క్రితం ఓంటారియో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది. గమనించిన అంశాలను వారు మాంట్రియల్ గెజిట్లో ప్రకటించారు. గుండె కవాటాల మార్పిడిలో అత్యంత నిపుణుడిగా పేరొందిన డాక్టర్ విల్ఫ్రెడ్ జి.బ్రెజిలో వాటిని సోదాహరణంగా వివరించారు. ‘మనిషి జీవనస్థితి నుంచి మరణ స్థితికి మారే క్షణాలను నేను ఎన్నో సందర్భాల్లో ప్రత్యక్షంగా గమనించాను. ఆ సమయంలో ఎన్నో విచిత్రమైన మార్పులు సంభవిస్తాయి. మనం స్పష్టంగా గమనించగల ఒక పరిణామం- కళ్లలోంచి జీవకళ మాయం అవుతుంది. కళ్లు అక్షరాలా తెల్లగా నిర్జీవంగా మారిపోతాయి’ అన్నారాయన. ఈ వివరాలన్నింటినీ- ఇస్కాన్ వ్యవస్థాపకులు ఎ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, తమ ‘ఆత్మసాక్షాత్కార శాస్త్రం’ అనే గ్రంథంలో ప్రస్తావించారు.
తమకు జన్మించిన పసికందును పురిటి వాసనలతో వదిలేసి మేనక, విశ్వామిత్రుడు ఎవరి దారిన వారు వెళ్ళిపోయిన కథ మనకు తెలిసిందే. నెత్తురోడుతున్న ఆ పసిగుడ్డును పక్షులు రక్షించాయి. శకుంతాలంటే పక్షులు. శకుంతాలు కాపాడిన బిడ్డ కాబట్టి ఆమెకు కణ్వమహర్షి ‘శకుంతల’ అని పేరు పెట్టారు. భారతంలోని ‘శకుంతలోపాఖ్యానం’, కాళిదాసు ‘అభిజ్ఞాన శాకున్తలమ్’ కథల్లో ఒక రహస్యం ఏమంటే- పసికందు దగ్గర పక్షులు కాచుకున్నది కాపాడటం కోసం కాదు, కబళించడం కోసం. పసిబిడ్డ చారెడు, పక్షుల రెక్కలు బారెడు. కాబట్టి గొడుగు పట్టినట్లు అయింది. నీడ దొరికింది. వాస్తవానికి పసిప్రాణాలు కాస్తా గుటుక్కుమంటే- ఆ మాంసం ముద్దను పీక్కుతిందామని పక్షులు వేచి చూశాయి. ఈ లోగా కణ్వమహర్షి వచ్చి ఆమెను కాపాడాడు. దాంతో కావ్యగత ధోరణి అద్భుత మానవీయ విలువల దిశగా సాగిపోయింది.
పరిమితమైన దయార్ద్ర హృదయాన్ని మానవత్వం అనుకొంటే, అపరిమితమైనదాన్ని మాధవత్వంగా చెప్పుకోవాలి. మహర్షులు మాధవ జాతి మహనీయులు. కణ్వమహర్షి ఆ కోవకు చెందినవారు. ‘కామంతో కళ్లు మూసుకుపోయిన ఏ కాముకురాలో కిరాతకంగా కని పారేసింది’ అని జనం చీదరించుకొనే దుస్థితి- ఆ నెత్తురు గడ్డది. సకల మాలిన్యాలతోను బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొన్న మహనీయుడు- ఆ మహర్షి. బండబారిన మనిషి గుండెను కాసింత చెమర్చేలా మానవీయ విలువలకు చెందిన విత్తులను కాసిని దానిలో మొలకెత్తేలా చేయడం- ప్రాచీన కావ్యాల పరమలక్ష్యం. పనిలో పనిగా పక్షుల కారుణ్యాన్ని పరిచయం చేయడం కోసం- అవి రెక్కలు విప్పి ఎండ తగలకుండా కాపాడాయని కవులు వర్ణించారు. బిడ్డ ప్రాణాలతో నిలిచి ఉండటానికి అదే కారణమని చెప్పారు.
ఇది అద్భుతమైన ప్రతిపాదన. అందులో సందేహం లేదు. అయితే సత్యం ఏమంటే- పక్షులు పసికందుపై దాడి చేయాలంటే, ముందు కనుగుడ్ల కదలిక ఆగిపోవాలి. వాటిలో జీవకళ అంతరించిపోవాలి. ప్రేతకళ ఆవరించాలి. కేవలం దాని కోసమే పక్షులు అంతసేపు కాచుకొన్నాయి. కదులుతున్నంతసేపు ఆ బిడ్డ జోలికి పోలేక ఆగిపోయాయి. భక్షించాలని వచ్చి తమకు తెలియకుండానే బిడ్డను రక్షించాయి. ఈ కథలో ఆధ్యాత్మికపరమైన అసలు రహస్యం ఏమంటే- ఆ బిడ్డకు ఇంకా ఈ లోకంలో నూకలున్నాయి. బతికే యోగం ఉంది. కాబట్టే మృత్యువు నీడే స్వయంగా ఆమెకు గొడుగు పట్టింది. ప్రాణాలు నిలబెట్టింది!
ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు