ammavodi:అమ్మఒడికి విద్యార్థుల హాజరుతో అనుసంధానం
‘2022 నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలి. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నాం. ఈ ఏడాది నుంచే ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి
ప్రతి పాఠశాలకు నిర్వహణ ఖర్చుగా రూ.లక్ష
విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
ఈనాడు, అమరావతి: ‘2022 నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలి. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నాం. ఈ ఏడాది నుంచే ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లలను చదువుబాట పట్టించాలన్న అమ్మఒడి స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. జూన్లో పాఠశాలలు ప్రారంభించేటప్పుడే అమ్మఒడి, విద్యాకానుక అందించాలన్నారు. కాబట్టి డిసెంబర్కే వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఇవ్వనున్న క్రీడా దుస్తులు, బూట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలన్నింటికీ సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఉండేలా చూడాలని, 2024 నాటికి సీబీఎస్ఈలోనే పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు క్రీడామైదానం తప్పనిసరిగా ఉండాలన్నారు. దీనిపై మ్యాపింగ్ చేసి, అన్నింటికీ మైదానాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. క్రమంగా ప్రీహైస్కూల్ స్థాయి వరకు క్రీడా మైదానాలుండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.లక్ష అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు, మరమ్మతులకు ఈ నిధి ఉపయోగపడుతుందని అన్నారు.
ఎయిడెడ్ బడులపై బలవంతం లేదు
ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఎలాంటి బలవంతం చేయటం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ‘వాటిని అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంది. వారే నడపాలనుకుంటే దానికి అభ్యంతరం లేదు. ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టం చేయాలి’ అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మ్యాపింగ్ వెంటనే పూర్తి చేయాలని, సబ్జెక్టుల వారీగా బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని సీఎం సూచించారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచటంపైనా దృష్టి పెట్టాలన్నారు.
పాఠశాలల పనితీరుపై ర్యాంకులు!
సోషల్ ఆడిట్ ద్వారా పాఠశాలల పనితీరుపై ర్యాంకులు ఇద్దామని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఎలాంటి మార్పులు తీసుకొచ్చినా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. సంస్కరణల ఉద్దేశాన్ని వారికి స్పష్టంగా చెప్పాలి. ఎక్కడ వెనకబడ్డామో తెలుసుకోవటమే లక్ష్యం కానీ తప్పులు వెతకటానికో, వాటికి బాధ్యులను చేయటానికో ఈ విధానం కాదని వారికి తెలియజేయాలి. అయోమయానికి, గందరగోళానికి తావివ్వద్దు’ అని సూచించారు. ప్రభుత్వ చర్యలతో పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు వివరించారు. ఉపాధ్యాయులందరికీ టీకా ఇవ్వటంతో వారంతా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆగస్టులో విద్యార్థుల హాజరు 73 శాతం ఉంటే.. సెప్టెంబర్లో 82, ఈ నెలలో 85 శాతానికి చేరిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 91 శాతంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
దాల్మియాకు చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్, పునీత్ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.