Andhra News: నా హయాంలో కొనలేదు.. వాడలేదు
‘పెగాసస్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా. ఆ సాఫ్ట్వేర్ను అమ్ముకోవడానికి
2019 మే తర్వాత ఏం జరిగిందో ప్రభుత్వమే ప్రకటన చేయొచ్చు
పెగాసస్పై మమత ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు
ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి వీడియోలూ లేవు
బ్యూరోక్రసీనే భయపడిపోతే దుర్మార్గుల నుంచి ప్రజల్ని ఎవరు రక్షిస్తారు?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘పెగాసస్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా. ఆ సాఫ్ట్వేర్ను అమ్ముకోవడానికి వెళ్లినవారు ఆమెను కలిసినప్పుడు.. ఫలానా వారు కొన్నారని ఆమెకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చని వారు నాతో అన్నారు’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తాను నిఘా విభాగాధిపతిగా పని చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం, నిఘా విభాగం, ఏసీబీ, సీఐడీ సహా ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలేవీ పెగాసస్ సాఫ్ట్వేర్ కొనటంగానీ, వాడటంగానీ చేయలేదని పేర్కొన్నారు. ట్రోజన్లు, మాల్వేర్లు వంటివీ ప్రభుత్వపరంగా వినియోగించలేదని చెప్పారు. 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు వరకూ తాను నిఘా విభాగాధిపతిగా కొనసాగానని.. ఆ తర్వాత రెండు నెలల వరకూ ఏం జరిగిందో తెలుసని చెప్పారు. తన హయాంలో ఫోన్లు ఏవీ ట్యాప్ కాలేదన్న భరోసా ఇస్తున్నానని చెప్పారు. విజయవాడలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
2019 మే తర్వాత పెగాసస్ కొన్నారో లేదో నాకు తెలీదు
‘పెగాసస్ వ్యవహారంలో 2019 మే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే తాము పెగాసస్సాఫ్ట్వేర్ కొనలేదంటూ 2021 ఆగస్టులో డీజీపీ కార్యాలయమే సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తికి సమాధానమిచ్చింది. ఇతర విభాగాలు ఈ సాఫ్ట్వేర్ను కొన్నాయేమోనన్న సందేహం ఎవరికైనా ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగొచ్చు. ఈ అంశంపై ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినా ఫరవాలేదు. జనాల్లో అపోహలు, సందేహాలు, ఆందోళనలు రేకెత్తించేందుకే పెగాసస్ వ్యవహారంలో కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై కనీసం శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ వ్యవహారంలో అసత్యాలు, విష ప్రచారాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, సీపీఆర్వో పూడి శ్రీహరి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, అబ్బయ్య చౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్ పత్రిక, స్వర్ణాంధ్ర, గ్రేటాంధ్ర వెబ్సైట్లపై పరువు నష్టం దావా వేయడానికి అనుమతివ్వాలని సీఎస్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రమిచ్చా.
నాపై విచారణకు ఏనాడూ వెనకాడలేదు
నాపై ప్రభుత్వం జరిపిన విచారణలో నేను వెనక్కి తగ్గలేదు. తాత్సారం చేసే ఎత్తుగడలు వేయలేదు. పది, పన్నెండేళ్లు సాగదీయాలనుకోలేదు. ఈ రోజు రాలేను.. రేపు రాలేను.. ఫలానా కారణాలతో రాలేను.. పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉంది. ఇక్కడ పెండింగ్లో ఉంది అంటూ ఏ రోజూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. త్వరగా విచారణ జరిపి నిజానిజాలేమిటో తేల్చమనే అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నాపై విచారణ జరిపి సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సమ్మతి కోసం ప్రతిపాదనలు పంపించింది. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేనూ కేంద్రాన్ని కోరాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పత్రాలు రాలేదని వారు చెబుతున్నారు. నా సస్పెన్షన్ చెల్లదని, అది చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఏడాదిగా అక్కడ పెండింగ్లో ఉంది. వీటిలో జాప్యానికి నేను కారణం కాదు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పినవన్నీ అబద్ధాలే
* ఆంధ్రప్రదేశ్లో 37 మంది డీఎస్పీలకు పదోన్నతులిస్తే 35 మంది ఓ సామాజికవర్గం వారే ఉన్నారని, అందుకు ఏబీ వెంకటేశ్వరరావే కారణమంటూ 2019 ఎన్నికలకు ముందు ఓ వ్యక్తి చేతిలో కాగితాలు ఊపుతూ మరీ ఎన్నికల సంఘానికి, గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అదంతా అబద్ధమని ఇప్పుడు హోం మంత్రే అసెంబ్లీలో చెప్పారు.
* ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారంలో అప్పట్లోనే మాకు నోటీసులొచ్చాయి. హోంశాఖ తరఫున సమాధానాలిచ్చాం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత.. ఆరు నెలలకు వైవీ సుబ్బారెడ్డి కేసు ఉపసంహరించుకున్నారు. సజ్జల వేసిన కేసులో పిటిషన్దార్ల తరఫున ఎవరూ హాజరు కావట్లేదంటూ కోర్టే డిస్మిస్ చేసింది.
అవి కొంటే.. వారు మావోయిస్టుల దాడిలో బలయ్యేవారు కాదు
‘అప్పట్లో నేను ప్రతిపాదించిన ఏరోస్టాట్, యూఏవీ పరికరాలు కొని ఉంటే అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలు జరిగి ఉండేవి కావు. వారిని కాపాడుకోగలిగే వాళ్లం. ఛత్తీస్గఢ్లో పదుల సంఖ్యలో సైనికులు మావోయిస్టుల దుశ్చర్యకు బలైపోయేవారు కాదు.
* వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నాకు తెలిసిన విషయాల్ని సీబీఐ అధికారులకు చెప్పాను’ అని వివరించారు.
* ‘నాకు రెండేళ్ల సర్వీసు ఉంది. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలి. రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం.’ (రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా)
ఐపీఎస్ అధికారిగా ఉండటమే.. నా బలహీనత అనుకుంటే ఎలా?
ఐపీఎస్ అధికారిగా ఉండటమే నా బలం అనుకున్నా. దాన్నే నా బలహీనతగా వారు భావిస్తే ఎలా? ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నన్నేమైనా అనొచ్చా? ఇలా అయితే అఖిల భారత సర్వీసు అధికారుల్లో అభద్రతభావం రాదా? దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాల నుంచి ప్రజల్ని రక్షిస్తూ వచ్చిన నేను ఇప్పుడు వాటికే బలైపోయాను. నన్ను నేనే రక్షించుకోలేకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తాను? నా ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వహిస్తాను? ఈ రోజు నేను ఎదుర్కొంటున్న పరిస్థితే రేపు మరో అధికారికి రావచ్చు. ఇలా అయితే బ్యూరోక్రసీ అంతా బెంబేెలెత్తిపోదా? అందరూ భయపడిపోయి పారిపోతే దుర్మార్గుల నుంచి ప్రజల్ని రక్షించేది ఎవరు?
అధికారుల్ని బంతాట ఆడుకోవచ్చు అనుకుంటున్నారా?
అఖిల భారత సర్వీసు అధికారులను బంతాట ఆడుకోవచ్చు.. ఉద్యోగుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. వారేమీ చేయలేరులే.. అనే ధోరణితో ఉంటే ఎలా? ఉద్యోగులమే కానీ మేమూ మనుషులమే. మాకంటూ వ్యక్తిత్వం ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు అఖిల భారత సర్వీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత అధికారికి వాటిని ఖండించే హక్కు నియమావళిలోనే ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నా.
అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది
నన్ను సస్పెండ్ చేసిన రోజు అర్ధరాత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి ఆరు పేజీల డాక్యుమెంటును మీడియాకు విడుదల చేశారు. రూ.25 కోట్ల కుంభకోణానికి, దేశద్రోహానికి పాల్పడినట్లు, దేశ రహస్యాలను విదేశాలకు చేరవేసినట్లు అందులో అసత్య ఆరోపణలు చేశారు. 2020 ఫిబ్రవరిలో నన్ను ప్రభుత్వం సస్పెండు చేయగా డిసెంబరు 18న నాపై అభియోగాలు మోపుతూ ఉత్తర్వులిచ్చింది. వాటిలో ఎక్కడా పూడి శ్రీహరి విడుదల చేసిన డాక్యుమెంటులోని ఆరోపణలు లేవు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదన్న సత్యం.. నాపై జరిగిన విచారణలో తేటతెల్లమైంది. కానీ శ్రీహరి చేసిన అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం వల్ల అన్ని నెలలపాటు నేను ఆ అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది’ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?