పోలీసులు మేకులు బిగిస్తే.. రైతులు పూల మొక్కలు నాటారు!
కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు దిల్లీ-ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులోని గాజీపుర్ వద్ద శుక్రవారం రోడ్డు పక్కన పూల మొక్కలు నాటి పోలీసుల చర్యలకు ప్రతిస్పందించారు. పోలీసులు దిల్లీ
నోయిడా: కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులు దిల్లీ-ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులోని గాజీపుర్ వద్ద శుక్రవారం రోడ్డు పక్కన పూల మొక్కలు నాటి పోలీసుల చర్యలకు ప్రతిస్పందించారు. పోలీసులు దిల్లీ సరిహద్దుల్లో దుర్భేద్య ఏర్పాట్లు చేసి రోడ్డుపై పెద్ద పెద్ద మేకులు బిగించిన సంగతి తెలిసిందే. రైతులు రాకుండా వారు మేకులు బిగిస్తే.. తాము వారి కోసం పూల మొక్కలు నాటడానికి నిర్ణయించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. ఈమేరకు బారికేడ్లకు సమీపంలో బంతిపూల మొక్కలను వరుసగా నాటారు. రోడ్డు వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు బీకేయూ మీడియా ఇన్ఛార్జి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. దిల్లీ-డాబర్ తిరాహా రహదారిని ఆనుకుని పూలతోటను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని నర్సరీల నుంచి రైతులు పూల మొక్కులు తెస్తున్నారు.
విదేశీ సెలబ్రిటీలు మద్దతిస్తే ఇబ్బందేమిటి..
రైతుల ఉద్యమానికి విదేశీ సెలబ్రిటీలు మద్దతిస్తే ఇబ్బందేమిటని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. పలువురు అంతర్జాతీయ కళాకారులు, కార్యకర్తలు తమకు మద్దతివ్వడాన్ని ఆయన స్వాగతించారు. దిల్లీ-ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులో గాజీపుర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికన్ పాప్ గాయని రీహానా, ఒకప్పటి శృంగార తార మియా ఖలీఫా, స్వీడన్ పర్యావరణ కార్యకర్త గ్రెటా తదితరులు ఉద్యమానికి మద్దతిస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా వారెవరో తనకు తెలియదని చెప్పారు. ‘‘అలాంటి వాళ్లు మద్దతిస్తే ఇవ్వొచ్చు. ఇందులో సమస్య ఏమిటి? వాళ్లు రైతులకేమీ ఇవ్వడం లేదు. మా నుంచి ఏమీ తీసుకెళ్లడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఉత్తర్ప్రదేశ్లో కిసాన్ పంచాయతీ..
రైతుల ఆందోళనకు మద్దతుగా పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లోని శామ్లీ జిల్లా భైన్స్వాల్ గ్రామంలో శుక్రవారం రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) ఆధ్వర్యంలో ‘కిసాన్ పంచాయతీ’ నిర్వహించారు. శామ్లీతో పాటు, పరిసర జిల్లాల నుంచి వేల మంది రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం అనుమతివ్వకుండా నిషేధాజ్ఞలు విధించినప్పటికీ అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. బీకేయూ సభ్యులతో పాటు ఆర్ఎల్డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌధరీ తదితరులు హాజరయ్యారు. పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రైతు సమావేశాల్లో ఇది నాలుగోది. ఇప్పటికే ముజఫర్నగర్, మథుర, బాఘ్పట్లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
* కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో చేపట్టిన ఆందోళనకు రాజస్థాన్ రైతులు మద్దతు తెలిపారు. జైపుర్లో రాష్టీయ్ర లోక్తాంత్రిక్ పార్టీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు