ఇంటి అద్దె భత్యంలో భారీ కోత
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)లో భారీ కోత పడింది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%,
హెచ్ఆర్ఏను తగ్గించిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)లో భారీ కోత పడింది. హెచ్ఆర్ఏ శ్లాబులను ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20%, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5%, మిగతా ప్రాంతాల్లో 12% ఇస్తున్నారు. కొత్త విధానంలో 50 లక్షల జనాభాకు మించి ఉన్న నగరాల్లో 24%, 5-50 లక్షల జనాభా ఉంటే 16%, మిగతా ప్రాంతాలు, ఐదు లక్షల వరకూ జనాభా ఉండే చోట 8శాతం హెచ్ఆర్ఏను తీసుకొచ్చింది. 50లక్షలకు పైగా జనాభా ఉన్న నగరం ఏపీలో ఒక్కటీ లేదు. దిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారికి మాత్రమే 24శాతం వర్తిస్తుంది. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు వెలగపూడి సచివాలయంలో పని చేసే వారికి 16శాతం, ఇతర ప్రాంతాల్లో పని చేసే వారికి 8శాతం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్ఏ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.
సచివాలయ ఉద్యోగులకు 14శాతం కోత..
హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం 30 శాతం హెచ్ఆర్ఏ తీసుకుంటుండగా.. కొత్త విధానం ప్రకారం వారికి 16శాతం మాత్రమే వస్తుంది. జనవరి వేతనంలో తగ్గిపోతుంది. ఒక్కో ఉద్యోగి 14శాతం నష్టపోతారు. ఈ మేరకు వేతనాల్లో కోత పడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన విభాగాధిపతి కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకూ తగ్గిపోనుంది. ప్రస్తుతం వీరు 30శాతం తీసుకుంటుండగా.. శాఖాధిపతుల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని అనుసరించి 16శాతం, 8శాతం ఇవ్వనున్నారు. దీంతో వారికి 14శాతం నుంచి 22శాతం వరకు తగ్గిపోతుంది. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా 16శాతం హెచ్ఆర్ఏను ఉత్తర్వుల్లో ప్రస్తావించగా.. శాఖాధిపతుల కార్యాలయాలకు స్థిర మొత్తాన్ని పేర్కొనలేదు.
పురపాలికల్లో శాఖాధిపతి కార్యాలయాలు..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలా శాఖాధిపతి కార్యాలయాలు తాడేపల్లి, ఇబ్రహీంపట్నం పురపాలక సంఘాలు, ఈడ్పుగల్లు, గొల్లపూడి లాంటి పంచాయతీల పరిధిలో ఉన్నాయి. ఇలాంటి చోట 8శాతం మాత్రమే హెచ్ఆర్ఏ వస్తుంది. ఇప్పటివరకు 30శాతం తీసుకున్న ఉద్యోగులకు జనవరి నుంచి ఇచ్చే వేతనంలో 8శాతం మాత్రమే ఇస్తారు. ఈ లెక్కన వారు 22శాతం నష్టపోతారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలోని వారికి 14శాతం తగ్గిపోతుంది.
* రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల పరిధిలో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం 20శాతం ఇస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో పని చేసే వారికి మాత్రమే 16శాతం వస్తుంది. ఈ నగరాల్లో పని చేసే వారు 4శాతం హెచ్ఆర్ఏను కోల్పోతారు. మిగతా జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో పని చేసే వారికి 8శాతం మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం వారు 12శాతం నష్టపోతారు.
* 50వేలకుపైగా జనాభా ఉన్న పురపాలక సంఘాల పరిధిలో 14.5శాతం ఇస్తున్న హెచ్ఆర్ఏ స్థానంలో 8 శాతం మాత్రమే వస్తుంది. అయా ఉద్యోగులు 6.5శాతం నష్టపోతారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 12శాతం ఇస్తుండగా.. ఇక నుంచి 8శాతం మాత్రమే వస్తుంది. అయా ప్రాంతాల్లో పని చేసే వారు 4శాతం నష్టపోతారు.
నగర భత్యం (సీసీఏ) రద్దు
నగర భత్యాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడల్లో ఉన్న వారికి నెలకు రూ.250-700 వరకు సీసీఏ ఇస్తుండగా.. మిగతా ప్రాంతాల్లో రూ.200-రూ.500 వరకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్రాలు దీన్ని నిలిపివేసినందున ఏపీలోనూ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు రాజాం, తణుకు, గుడివాడ, బాపట్ల, గూడూరు (తిరుపతి జిల్లా), భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
నూతన నేర న్యాయ చట్టాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు.