తెలంగాణతో పోలిస్తే తగ్గిన వేతనాలు
పీఆర్సీ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 23 శాతమే ఫిట్మెంట్ ఇవ్వడం, ఇంటి
పోల్చిచూసుకుని ఉద్యోగుల ఆందోళన
ఈనాడు, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు వేతనాల్లో చాలా వ్యత్యాసం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 23 శాతమే ఫిట్మెంట్ ఇవ్వడం, ఇంటి అద్దెభత్యం తగ్గించడం, సీసీఏ తొలగించడంతో తాము నష్టపోతున్నామని ఏపీ ఉద్యోగులు వాపోతున్నారు. సెక్షన్ ఆఫీసర్ కేడర్లో ఉన్న ఉద్యోగులకు వేతనంలో రూ.10వేలకు పైగా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు పదోవేతన సవరణ సంఘం సిఫారసుల్ని అమలుచేశాయి. రెండు ప్రభుత్వాలూ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాయి. అయితే తెలంగాణ కంటే ఏపీలో మాస్టర్స్కేల్ మెరుగ్గా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉండటంతో కొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఏపీలోనే ఎక్కువ వేతనాలుండేవి. తర్వాత 11వ పీఆర్సీ సిఫారసుల అమల్లో భాగంగా 2021 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ప్రకటించింది. ఏపీ 27% మధ్యంతర భృతి ఇస్తూ వచ్చింది. తాజాగా 23% ఫిట్మెంట్ ప్రకటించింది.
వేతనాల్లో వ్యత్యాసం ఇలా..
* హైదరాబాద్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీస మూలవేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 30% ఫిట్మెంట్, 2018 జులై 7 నాటికి 30.392% డీఏ ప్రాతిపదికన లెక్కిస్తే రూ.60,480 (మాస్టర్స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్లో పెట్టడం వల్ల) కనీస మూలవేతనం వస్తోంది. దానికి 24% హెచ్ఆర్ఏ, రూ.1,250 సీసీఏ కలిపితే రూ.76,245 వేతనం వస్తోంది. 2019 జనవరి 1 నుంచి 2021 జులై 1 వరకు పెండింగ్లో ఉన్న డీఏల్ని కలిపితే ఆ ఉద్యోగికి మొత్తం రూ.88,353 వేతనం వస్తుంది.
* ఆంధ్రప్రదేశ్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.37,100 కనీసం మూల వేతనం ఉన్న సెక్షన్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగికి... 2018 పీఆర్సీ ప్రకారం 23% ఫిట్మెంట్, 30.392% డీఏ లెక్కిస్తే కనీస మూలవేతనం రూ.57,220 (మాస్టర్స్కేల్ ప్రకారం తదుపరి స్టేజ్లో పెట్టడంతో) అవుతుంది. దానికి 16% హెచ్ఆర్ఏ కలిపితే రూ.66,375 అవుతుంది. పెండింగ్ డీఏల్ని కలిపితే వేతనం రూ.77,831 అవుతుంది. అంటే తెలంగాణతో పోల్చితే రూ.10,522 తగ్గుతోంది.
* తెలంగాణలో సూపరింటెండెంట్ ర్యాంక్ ఉద్యోగికి 2013 పీఆర్సీ ప్రకారం కనీస మూలవేతనం రూ.28,940 ఉంటే... ప్రస్తుతం అది రూ.47,240కి చేరింది. దానికి 11% హెచ్ఆర్ఏ, పెండింగ్లో ఉన్న డీఏలు కలిపితే మొత్తం వేతనం రూ.61,893కి చేరుతుంది.
* ఆంధ్రప్రదేశ్లో 2013 పీఆర్సీ ప్రకారం రూ.28,940 కనీస మూలవేతనం ఉన్న అదే కేడర్ ఉద్యోగికి... 23% ఫిట్మెంట్, 30% డీఏ ప్రకారం అది రూ.44,570కి చేరుతుంది. కానీ ఇక్కడ హెచ్ఆర్ఏ 8 శాతమే. హెచ్ఆర్ఏతో పాటు, పెండింగ్ డీఏలు కలిపితే వచ్చే మొత్తం వేతనం రూ.57,059. అంటే తెలంగాణకు ఇక్కడికి రూ.4,834 వ్యత్యాసం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM