కోర్టులు చెప్పే వరకు కదలరా?
కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది.
కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఏపీ తాత్సారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
హాజరై క్షమాపణలు చెప్పిన సీఎస్ సమీర్శర్మ
ఇకపై ఇలాంటిది జరగదని న్యాయస్థానానికి హామీ
ఈనాడు, దిల్లీ: కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన తాత్సార వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ఖన్నాలతో కూడిన ధర్మాసనం విరుచుకుపడింది. పదేపదే జారీ చేస్తున్న ఉత్తర్వులను పట్టించుకోరా? అని నిలదీసింది. కోర్టులు చెప్పేంతవరకూ స్పందించే గుణం లేదా, ఆ మాత్రం సున్నితత్వం (సెన్సిటివిటీ) లేకుండా పోయిందా అని మండిపడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ రెండు రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో ఏపీ సీఎస్ సమీర్శర్మ, బిహార్ సీఎస్ అమిర్ సుభానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ముందు హాజరై క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
బుధవారం ఉదయం కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘కొవిడ్తో మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని పదేపదే ఉత్తర్వులు జారీచేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్సారం చేసింది. కొవిడ్తో 14,471 మంది మృతి చెందినట్లు రికార్డుల్లో నమోదైతే, పరిహారం కోసం 31 వేలకుపైగా దరఖాస్తులొచ్చినట్లు న్యాయవాది చెప్పారు. ఇప్పటివరకు 11వేల మందికే పరిహారం చెల్లించారు. అర్హులకు పరిహారం చెల్లించకపోవడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత వహించాలి. సీఎస్ రెండు గంటలకు హాజరై, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలి’’ అని జస్టిస్ ఎంఆర్ షా ఆదేశించారు. బిహార్ సీఎస్కూ ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో రెండురాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మధ్యాహ్నం 2 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది బసంత్ సమగ్ర వివరాలను మరోసారి కోర్టుకు వివరించారు.
ఇప్పటివరకు 23,895 క్లెయిమ్లకు క్లియర్ చేశామనగా జస్టిస్ ఎంఆర్షా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉదయం 11,494 క్లెయిమ్లే చెల్లించినట్లు చెప్పి, ఇప్పుడు 23వేల పైచిలుకు లెక్కలు చెబుతున్నారేంటి? అని ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ కొంత అయోమయంతో అలా చెప్పామని, ఇంకా చెల్లించాల్సిన క్లెయిమ్లు 10,894 మాత్రమే ఉన్నాయన్నారు. కోర్టు ఆరాటంతోనే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని, అర్హమైన అన్నింటినీ క్లియర్ చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. దాంతో జస్టిస్ ఎంఆర్ షా అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆరాటం కోర్టుకు తప్పితే మీకు లేదని వ్యాఖ్యానించగా న్యాయవాది స్పందిస్తూ... సీఎస్ ఇక్కడే ఉన్నారని, మీ ఆరాటాన్ని వారికి చెప్పి త్వరగా చర్యలు తీసుకొనేలా చేస్తామన్నారు. అందుకు జస్టిస్ ఎంఆర్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి విషయంలో కోర్టు చెప్పేంతవరకు ఎందుకు వేచిచూస్తున్నారు? పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇప్పటివరకు మీ ముందుకు వచ్చిన క్లెయిమ్ల్లో రికార్డులపరంగా నమోదైన 14,471 కేసులను కలిపారా? లేదా? అని అడిగారు. వాటినీ కలిపామంటూనే సీఎస్ సమీర్శర్మ కూడా ఇక్కడే ఉన్నారని న్యాయవాది పేర్కొనగా... ఆయన తెరమీదికి వచ్చి కోర్టుకు క్షమాపణలు తెలిపారు. జరిగిన దానికి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు. రికార్డులను తనిఖీచేస్తున్నామని కొన్నిచోట్ల పేర్లుంటే, మరికొన్నిచోట్ల వయసు మాత్రమే ఉందని, ఇంకొన్నింటిపై అడ్రస్ లేకపోవడంతో అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని వివరించారు. దానిపై జస్టిస్ ఎంఆర్ షా తీవ్రంగా మండిపడ్డారు.
మీరు రికార్డులను అంత లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్నమాట అని అసహనంగా వ్యాఖ్యానించారు. కిందిస్థాయిలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని, ఇకపై ఏదైనా తప్పు జరిగితే కోర్టు ధిక్కరణ కింద శిక్ష ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉంటానని, మరో రెండు వారాల్లో అందరికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ మరోసారి ఇలా హాజరయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సమీర్శర్మకు సూచించారు. సీఎస్ స్పందిస్తూ ‘‘ఇలా సుప్రీంకోర్టు ముందు హాజరుకావడం ఇదే తొలిసారి. చాలా అవమానకరంగా, టెరిబుల్గా ఉంది. మరోసారి ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా’’ అని హామీ ఇవ్వడంతో ధర్మాసనం వాదనలను ముగించి తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అనాథలైన పిల్లలను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పరిహారం కోసం 41,292 దరఖాస్తులు రాగా, అందులో 34,819 దరఖాస్తులకు పరిహారం పొందే అర్హత ఉన్నట్లు తేల్చారు. వీటిలో 23,895కి పరిహారం అందింది. 10,984 మందికి చెల్లించాల్సి ఉంది.
అందులో 5,141 క్లెయిమ్లను క్లియర్ చేశారు. వాటికి మూడురోజుల్లోపు చెల్లించేయాల్సి ఉంది. ఇప్పటివరకు తిరస్కరించిన 6,473 క్లెయిమ్లను సంబంధిత ఫిర్యాదుల పరిష్కార కమిటీలు సొంతంగా సమీక్షించి, దరఖాస్తుల్లోని లోపాలను సరిదిద్దుకొనే అవకాశమివ్వాలి. బాల్స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన మేరకు కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే పోర్టల్లో పేర్లు నమోదైన పిల్లలను చేరుకొని వారికి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాల్లో వాస్తవంగా నమోదైన మరణాలు, బాల్స్వరాజ్ పోర్టల్లో నమోదైన వివరాలను అక్కడి ప్రభుత్వాలు స్థానిక లీగల్ సర్వీస్ అథారిటీకి అందించాలి. తల్లిదండ్రులు ఇద్దరినీ, ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలన్నీ సమర్పించాలి’’ అని జస్టిస్ ఎంఆర్షా ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?