మళ్లీ కేసుల వరద
దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరరీతిలో పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గురువారం 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉ. 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు) కొత్తగా 3,17,532 మంది కొవిడ్ బారిన
24 గంటల్లో 3,17,532 మందికి కొవిడ్-19
దిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరరీతిలో పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య గురువారం 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో (బుధవారం ఉ. 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు) కొత్తగా 3,17,532 మంది కొవిడ్ బారిన పడ్డారు. 491 మంది కరోనాతో మృతి చెందారు. గత 249 రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లు దాటగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కి పెరిగింది. ఒక్కరోజులో 93,051 క్రియాశీలక కేసులు పెరగడంతో వాటి మొత్తం సంఖ్య 19,24,051 (5.03%)కి, మరణాల సంఖ్య 4,87,693కు చేరింది.
ఐదేళ్ల లోపు వారికి మాస్కులొద్దు!
దిల్లీ: ఐదేళ్లు.. ఆ లోపు వయసు పిల్లలకు మాస్కులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు 18 ఏళ్ల లోపు పిల్లలకు మందులు, మాస్కుల వినియోగానికి సంబంధించి కేంద్రం గురువారం సవరించిన కొవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్ఫెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. ఈ వయసు వారికి యాంటీవైరల్స్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ను సిఫార్సు చేయడం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఒకవేళ స్టెరాయిడ్స్ వాడితే.. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా 10-14 రోజుల్లో వాటిని క్రమేపీ తగ్గించేయాలని పేర్కొంది. తాజాగా కొవిడ్ కేసులు అమాంతం పెరుగుతుండటంతో పాటు, ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మార్గదర్శకాలను నిపుణుల బృందం సమీక్షించింది. ఈమేరకు సవరించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. 6-11 ఏళ్ల పిల్లలకు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాస్కులు వాడొచ్చు. పిల్లలు మాస్కులు ధరించగలుగుతున్నారా? అవి సురక్షితమేనా? వంటి అంశాలను పరిశీలించాలి. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు మాత్రం పెద్దల మాదిరిగానే మాస్కులు వాడొచ్చు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కేసుల్లో చికిత్సకు యాంటీబయోటిక్స్ వాడొద్దని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక మాదిరి లేదా తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లోనూ నిర్దేశించిన పరిస్థితుల్లో తప్ప వీటిని వాడరాదని స్పష్టం చేసింది. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కేసులకు సంబంధించి స్టెరాయిడ్లు కూడా వాడొద్దని పేర్కొంది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే.. అదీ నిపుణుల కీలక పర్యవేక్షణలోనే వీటిని వాడాలని తెలిపింది. సరైన సమయంలో, తగినంత డోసులో, తగినంత కాల వ్యవధిలో మాత్రమే స్టెరాయిడ్లు వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు 5-7 రోజుల వరకు వాటిని కొనసాగించాలని తెలిపింది. తొలి 3-5 రోజుల వరకు మాత్రం వాడొద్దని స్పష్టం చేసింది. కొవిడ్ బారిన పడిన పిల్లల్లో లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న వారికి సాధారణ సంరక్షణ కల్పించాలని, అర్హులైనవారికి టీకాలు వేయించాలని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా వారి సంరక్షణకు సంబంధించిన పలు విధివిధానాలను వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట