Amaravathi:కేంద్రమూ తప్పించుకోలేదు!
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతున్నా రాష్ట్రంలో ఉండాల్సిన చాలా కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాలు ఇంతవరకూ ఏర్పాటు కాలేదు. రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అమరావతిలో స్థలాలు తీసుకుని ఇన్నాళ్లూ మీనమేషాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయ భవనాల నిర్మాణంపై తాత్సారం
24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 18 పీఎస్యూలు స్థలాలు తీసుకుంటే..
నిర్మాణం మొదలుపెట్టింది ఎన్ఐడీ భవనాలు మాత్రమే
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లవుతున్నా రాష్ట్రంలో ఉండాల్సిన చాలా కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాలు ఇంతవరకూ ఏర్పాటు కాలేదు. రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతిలో తమ విభాగాలు, సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టకుండా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. రాజధానిలో పలు కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు సీఆర్డీఏ 2016-19 మధ్యలోనే భూములు కేటాయించింది. వాటిలో చాలా సంస్థలు భూమి ధరనూ చెల్లించాయి. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) తప్ప మరే ఇతర సంస్థా నిర్మాణాలు మొదలుపెట్టలేదు. వైకాపా అధికారంలోకి వచ్చి, రాజధాని పనులు నిలిపివేసిన తర్వాత... భూములు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక్కటీ అటువైపు చూడలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిలో తమ సంస్థల కార్యాలయాల నిర్మాణాల్ని మొదలుపెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కేంద్రానికి బాధ్యత లేదా?
అమరావతి నిర్మాణానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే శంకుస్థాపన చేశారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర పాలన అమరావతి నుంచే సాగుతోంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు చేపట్టకపోవడమేంటి? కొత్త రాష్ట్ర రాజధానిలో తమ సంస్థలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రం 2018లో సెంట్రల్ సెక్రటేరియేట్ విధానం తీసుకొచ్చింది. రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ఒకేచోట ఏర్పాటుచేయడం దీని లక్ష్యం. దీని కోసం సీపీడబ్ల్యూడీ.. సీఆర్డీఏ నుంచి 28 ఎకరాల స్థలం కోరింది. సీఆర్డీఏ 22.5 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ పనులు మొదలుపెట్టలేదు సరికదా, 2022-23 బడ్జెట్లో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియేట్కి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రూ.లక్ష మాత్రమే కేటాయింపులు చూపించింది. ఎన్ఐడీలాగే మిగతా సంస్థల కార్యాలయాల నిర్మాణాలూ మొదలుపెట్టకుండా.. మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్ఐడీ నిర్మాణమూ నత్తనడకనే సాగుతోంది. తాత్కాలికంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 2016లో ఎన్ఐడీతో పాటే రాజధానిలో భూములు తీసుకున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎస్ఆర్ఎం, విట్ ఐదేళ్ల కిత్రమే తరగతులు ప్రారంభించడం గమనార్హం.
ఇచ్చినదెంత.. చెప్పేదెంత?
అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ.1,500 కోట్లే. విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చిన రూ.1,000 కోట్లనూ కలిపి రాజధానికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్టు చెబుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక... అమరావతి నిర్మాణానికి నిధులు కావాలని గానీ, కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయాలని గానీ కోరకపోవడం, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో కేంద్రం కూడా మౌనం వహించింది. కానీ పునర్విభజన చట్టం ప్రకారం ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుందని హైకోర్టు తేల్చిచెప్పింది. దీంతో కేంద్రప్రభుత్వం తన బాధ్యతను విస్మరించేందుకు వీల్లేదు. స్థలాలు తీసుకున్న సంస్థల కార్యాలయ భవనాల నిర్మాణం వెంటనే మొదలుపెట్టడంతో పాటు, ఇతర కేంద్రప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నీ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
అమరావతిలో 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని సీఆర్డీఏ కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్ల చొప్పున, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా, కొన్నింటికి తక్కువ ధరకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది.
గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత వాటిని ఆంధ్ర ప్రదేశ్లోనూ ఏర్పాటు చేయాలి. కానీ కేంద్రం ఆ బాధ్యతను విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!