టర్న్కీ సూత్రధారి శేఖర్రెడ్డే
ఆంధ్రప్రదేశ్లోని ఇసుక తవ్వకాలు, వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టర్న్కీ ఎంటర్ప్రైజ్ సంస్థ.. తమిళనాడులో ఇసుక దందాలకు పేరొందిన శేఖర్రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ సంస్థ
బోసాని శ్రీనివాసరెడ్డి ఆయన భాగస్వామి.. సన్నిహితుడే
పేరుకే జేపీ పవర్ వెంచర్స్.. నడిపించేదంతా ‘టర్న్కీ’నే
జీఎస్టీ నంబరు వచ్చే వరకూ కొన్నాళ్లు ఆగారంతే..
ఇసుక దందాను శేఖర్రెడ్డి చేతిలో పెట్టాలని ముందే పథకం
ఆ సొమ్మంతా జగన్ చెంతకే చేరుతోంది
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఇసుక తవ్వకాలు, వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టర్న్కీ ఎంటర్ప్రైజ్ సంస్థ.. తమిళనాడులో ఇసుక దందాలకు పేరొందిన శేఖర్రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఆ సంస్థ డైరెక్టరు బోసాని శ్రీనివాసరెడ్డి శేఖర్రెడ్డికి వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం చేసుకుందని, అప్పట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపి సొత్తు పట్టుకున్నారని వివరించారు. ఈ విషయాలన్నీ 2016 డిసెంబరు 9న ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమయ్యాయని వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి కంటే ముందు టర్న్కీ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా వ్యవహరించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడురు వాసి కోడూరి తనూజ శేఖర్రెడ్డికి సమీప బంధువని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో పట్టాభి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టర్న్కీ ఎంటర్ప్రైజ్ పేరిట రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, వ్యాపారం మొత్తాన్ని జగన్మోహన్రెడ్డి సహకారంతో హస్తగతం చేసుకున్న శేఖర్రెడ్డి ఆంధ్ర ఇసుక మాఫియా డాన్గా మారారని ఆరోపించారు. ఇసుకలో వేల కోట్లు లూటీ చేసి జగన్రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు.
దోపిడీ పథకంలో భాగంగానే..
‘రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని శేఖర్రెడ్డి చేతిలో పెట్టాలని ముందుగానే నిర్ణయించుకుని అతడి వ్యాపార భాగస్వాములు బోసాని శ్రీనివాసరెడ్డి, బోసాని రవికాంత్రెడ్డిలతో టర్న్కీ ఎంటర్ప్రైజ్ సంస్థను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఇసుక టెండర్ల నాటకానికి తెరలేపి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే కీలు బొమ్మ సంస్థను తెరపైకి తెచ్చారు. తాము అనుకున్న విధంగా సబ్ కాంట్రాక్టు పేరిట శేఖర్రెడ్డికి చెందిన టర్న్కీ ఎంటర్ప్రైజ్ చేతుల్లోకి ఇసుక వ్యాపారమంతా వచ్చేలా చేశారు. వేల కోట్ల దోపిడీ పథకంలో భాగంగానే జేపీ పవర్ వెంచర్స్, టర్న్కీ ఎంటర్ప్రైజ్ సంస్థలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. 2020 డిసెంబరు 30న టర్న్కీ సంస్థ ఏర్పాటైంది. వారం రోజుల్లోనే అంటే 2021 జనవరి 5న ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని టెండర్ల ద్వారా ఏదైనా కేంద్ర సంస్థకుగానీ, ప్రైవేటు సంస్థకుగానీ అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. అయినా ఆ సంస్థ మొదటి రెండు, మూడు నెలలపాటు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించలేదు. టర్న్కీ ఎంటర్ప్రైజ్కు జీఎస్టీ నంబరు రాకపోవటమే దీనికి కారణం. అది వచ్చే వరకూ వేచి చూసి ఆ తర్వాత 2021 మే 21 నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. శేఖర్రెడ్డి ప్రమేయం, భాగస్వామ్యంతో అంతా ముందస్తు పథకం ప్రకారమే ఇదంతా జరిగిందనేందుకు ఇంత కంటే ఆధారాలు ఏం కావాలి? ‘టర్న్కీ సంస్థ ఎవరిదో మాకు అనవసరం’ అంటూ గనులశాఖ ఇన్ఛార్జ్ సంచాలకుడు చంద్రశేఖర్, ‘సబ్ కాంట్రాక్టు ఎవరికి ఇస్తారో వాళ్లిష్టం’ అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
ఏ రోజు ఆదాయం ఆ రోజే..
రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని పేరుకే జేపీ పవర్ వెంచర్స్ నిర్వహిస్తోంది. చక్రం తిప్పేదంతా టర్న్కీ ఎంటర్ప్రైజ్ సంస్థే. సబ్ కాంట్రాక్టు పేరిట జగన్రెడ్డి ఇసుక వ్యాపారం మొత్తాన్ని తన బినామీ శేఖర్రెడ్డి గుప్పిట్లో పెట్టారు. రాష్ట్రంలోని ఏ ఇసుక రీచ్కు వెళ్లినా టర్న్కీ ప్రతినిధులే కనిపిస్తారు. జగన్కు ఇసుకపై వచ్చే ఆదాయం ఎంతో ఏ రోజు లెక్క ఆ రోజే తేలిపోవాలి. సాయంత్రానికి చేరాల్సిన వారికి చేరిపోవాలి. అందుకే ఆన్లైన్ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలనే అంగీకరిస్తున్నారు.
ఎవరి మాట నిజం.. మంత్రిదా? గనుల శాఖదా?
రీచ్లలో ఆన్లైన్ ఇన్వాయిస్లు ఇచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తామని గనులశాఖ ఇన్ఛార్జ్ సంచాలకుడు చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో చెబుతుంటే.. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు. ఉల్లంఘనలపై ఒక్క కేసూ నమోదు చేయలేదని చంద్రశేఖర్ చెప్పగా.. ఇప్పటికే వేల కేసులు నమోదు చేశామని మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. వీరిద్దరి మాటల్లో ఎవరిది నిజం? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పనిలో ప్రావీణ్యం ఉన్నవారు ఉండొచ్చంటూ మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు. నేనూ అదే చెబుతున్నా.. శేఖర్రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్న వారికి ఇసుక లూటీ, దొంగతనంతోపాటు వేల కోట్లను ఎలా లాగించాలన్న విషయంలో ప్రావీణ్యం ఉంది. అందుకే ఆయనను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు’ అని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!