ఉదయ్ పథకంతోనూ మారని తెలుగు రాష్ట్రాల డిస్కంలు
సంస్కరణలు తెచ్చినా తెలుగు రాష్ట్రాల డిస్కంల ఆర్థిక స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉజ్వల్ డిస్కం హామీ యోజన (ఉదయ్) పథకం 2015లో అమల్లోకి వచ్చినా డిస్కంలు బలపడలేదని కేంద్ర విద్యుత్తు శాఖ
అప్పుల ఊబిలో విద్యుత్తు పంపిణీ సంస్థలు
తెలంగాణ- రూ.21947 కోట్లు- ఏపీవి రూ.26,811
కేంద్ర విద్యుత్తు శాఖ తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్ : సంస్కరణలు తెచ్చినా తెలుగు రాష్ట్రాల డిస్కంల ఆర్థిక స్థితిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఉజ్వల్ డిస్కం హామీ యోజన (ఉదయ్) పథకం 2015లో అమల్లోకి వచ్చినా డిస్కంలు బలపడలేదని కేంద్ర విద్యుత్తు శాఖ పార్లమెంటుకిచ్చిన తాజా నివేదికలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డిస్కంల అప్పులన్నీ కలిపి 2019-20 ఆఖరునాటికే రూ.5.14 లక్షల కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.48,758 కోట్లు. ఏటా ఈ రుణం పెరుగుతూ ఉంది. ఉదయ్ పథకం కింద 2015 సెప్టెంబరు ఆఖరునాటికి డిస్కంలకున్న మొత్తం అప్పుల్లో 75 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేశారు. ఇక మిగిలిన కొద్దిపాటి అప్పులతో ఈ సంస్థలు ఆర్థికంగా బలపడతాయని కేంద్రం అప్పట్లో అంచనా వేసింది. కానీ అలా కాకుండా అప్పులు మరింత పెరిగాయి. ఉదయ్ అమల్లోకి వచ్చి తొలి ఏడాది అన్ని డిస్కం అప్పులు రూ.4.21 లక్షల కోట్లుంటే నాలుగేళ్ల తరవాత రూ.5.14 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలవ్యవధిలో తెలుగు రాష్ట్రాల అప్పులు రూ.29,634 కోట్ల నుంచి రూ.48,758 కోట్లకు పెరిగాయి.
పెరుగుతున్న సగటు నష్టం..: ఈ నాలుగేళ్లలో తెలంగాణలో యూనిట్ కరెంటు సరఫరాకు పెడుతున్న ఖర్చులో సగటున వచ్చే నష్టం 74 పైసల నుంచి 109 పైసలకు పెరిగింది. ఉదయ్ పథకం అమలుచేస్తే ఈ లోటు గణనీయంగా తగ్గాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది. దేశవ్యాప్తంగా సగటున ఈ లోటు 48 నుంచి 30 పైసలకు తగ్గగా తెలంగాణలో మాత్రం 74 నుంచి 109కి పెరిగింది. అదే సమయంలో అగ్రిగేటెడ్ ట్రాన్స్మిషన్ కమర్షియల్ (ఏటీసీ) నష్టాలు 14.01 నుంచి ఏకంగా 21.54 శాతానికి పెరిగినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో ఏటీసీ నష్టాలు 20.93 శాతముంటే తెలంగాణలో మరో 0.61 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఈ నష్టాలు పెరగడం వల్ల తెలంగాణ డిస్కంలకు ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్న కరెంటుకు బిల్లులు నెలనెలా చెల్లించకపోవడం వల్ల రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. సమగ్ర విద్యుత్తు అభివృద్ధి (ఐపీడీఎస్) పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చిన కేంద్రం డిస్కంల పనితీరులో సంస్కరణలు తేవాలని సూచించింది. ప్రతి కరెంటు కనెక్షన్కు తప్పనిసరిగా స్మార్ట్మీటరు ఏర్పాటుచేసి ప్రతీ యూనిట్ కరెంటు ఎక్కడి నుంచి ఎటు వెళుతుందనే లెక్క తేల్చాలని చెప్పింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్మీటర్లు పెట్టాలనే కేంద్రం ఇచ్చిన సూచనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో డిస్కంలు కూడా వీటి ఏర్పాటుకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.