సీఎస్ఈలో సీటుందా?
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ సీటే కావాలి.. సాఫ్ట్వేర్ ఇంజినీరే అవ్వాలి.. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం పొందడం, లేదంటే పీజీ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచిపైనే ఆసక్తి చూపుతున్నారు.
ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుపైనే ఆసక్తి
తల్లిదండ్రులు, విద్యార్థుల అన్వేషణ
కళాశాలలు, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల్లో సీఎస్ఈలోనే 50%పైగా సీట్లు
ఈనాడు - అమరావతి
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ సీటే కావాలి.. సాఫ్ట్వేర్ ఇంజినీరే అవ్వాలి.. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. ప్రాంగణ నియామకాల్లోనే ఉద్యోగం పొందడం, లేదంటే పీజీ చేసేందుకు విదేశాలకు వెళ్లాలనే దృక్పథంతో అందరూ ఈ బ్రాంచిపైనే ఆసక్తి చూపుతున్నారు. కరోనాతో డిజిటలైజేషన్లో వచ్చిన మార్పుల కారణంగా సాఫ్ట్వేర్ నియామకాలు భారీగా పెరగడం.. ఇతర విభాగాల్లో ప్రాంగణ నియామకాలు సరిగా లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు సీఎస్ఈ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ బ్రాంచిలో రాష్ట్రంలో సీటు లభించకపోతే తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఈఏపీసెట్, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థి తెలివితేటలతో సంబంధం లేకుండా సీఎస్ఈ కోసమే పోటీ పడుతున్నారు. ఇప్పటికే డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సీట్లు దాదాపుగా నిండిపోయాయి. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రకటన విడుదల కాకపోయినా అనధికారికంగా ఒప్పందాలు జరిగిపోయాయి. విద్యార్థుల నుంచి డిమాండ్ రావడంతో ఒక్కసారిగా డొనేషన్లు, ఫీజులను పెంచేశాయి. విజయవాడలోని ఓ ప్రముఖ కళాశాలలో సీఎస్ఈ సీటు కోసం ఏడాదికి రూ.2.10లక్షలు తీసుకుంటుండగా.. సివిల్, మెకానికల్లాంటి విభాగాల్లో రూ.69వేలకే సీటు ఇస్తామన్నా చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతుల ప్రక్రియ జులైతో ముగిసింది.
పెరిగిన సీట్లు.. ఫీజులు..
విద్యార్థుల డిమాండ్ ఆధారంగా రోజు రోజుకు ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజుల్లో మార్పు జరుగుతోంది. వీటిల్లో డొనేషను రూ.2.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉంది.
ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35శాతం సీట్లు కన్వీనర్ భర్తీ చేస్తుండగా.. మిగతా 65శాతం యాజమాన్యాలు నింపుకొంటున్నాయి. సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కొంత రాయితీలు ఇస్తున్నాయి. ఈఏపీసెట్తో సంబంధం లేకపోవడంతో ఇప్పటికే వీటిల్లో దాదాపుగా సీట్లు నిండిపోయాయి. కొన్ని ప్రైవేటు వర్సిటీలు ఏడాదికి రూ.3.20లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ మండలి నిర్ణయించిన ఫీజుపై మూడింతలు తీసుకుంటుండగా.. మరికొన్ని అదనంగా రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయి.
ట్రెండ్పై అవగాహన లేకపోవడమూ కారణమే..
ఐటీ నియామకాల్లో ట్రెండ్ పూర్తిస్థాయిలో మారింది. ఇంజినీరింగ్లో సీఎస్ఈ చదవాలి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలనే విధానానికి భిన్నంగా ఏ బ్రాంచి చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు బ్రాంచిల కంటే విద్యార్థి నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచిల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చదువుతున్న వారు పైథాన్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్, జావా, సర్టిఫికేషన్ కోర్సులు లాంటివి నేర్చుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందుతున్నారు. బీటెక్ చదువుతున్న సమయంలోనూ, పూర్తయిన తర్వాత పైథాన్, జావాలాంటివి నేర్చుకోవడం కష్టమని, ఆ తర్వాత దానికి సమయం కేటాయించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సీఎస్ఈకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అదనపు సీట్లకు ప్రతిపాదనలు
* రాష్ట్రంలో ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మినహా ప్రైవేటు, వర్సిటీ కళాశాలల్లో ఈ ఏడాది ఒక్క సీఎస్ఈలోనే 15,912 సీట్లు పెరిగాయి. గతేడాది 51,994 సీట్లు ఉండగా.. ఈసారి ఈ సంఖ్య 67,906కు చేరింది. ఈ ఏడాది ఈఏపీసెట్లో 1,73,572మంది అర్హత సాధించారు. గతేడాదితో పోల్చితే విద్యార్థుల సంఖ్య 40వేల వరకు పెరిగింది.
* రాష్ట్రంలో 240 వరకు ప్రైవేటు కళాశాలలు ఉండగా.. వీటిల్లో సీఎస్ఈలో 67వేలకుపైగా సీట్లు ఉన్నాయి. 30శాతం యాజమాన్య కోటా సీట్లకు డిమాండ్ నెలకొంది.
* ఓ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 4వేల సీట్లు ఉండగా.. 2,500 సీఎస్ఈలోనే ఉన్నాయి. మరో 300 సీట్ల కోసం యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో డీమ్డ్ వర్సిటీలోనూ సీఎస్ఈలో 2వేలకుపైగా సీట్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు