ఈ యంత్రాలకు మంత్రం వేసేది ఎవరు?
ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పాడై.. రోగులు అవస్థలు పడుతున్నా.. వాటిని బాగుచేసే చర్యలు కనిపించడంలేదు. రాష్ట్రంలోని వివిధ రకాల ప్రభుత్వాసుపత్రుల్లో
ఆసుపత్రుల్లో పాడైన వైద్య పరికరాలు
పర్యవేక్షణ సంస్థ ఎంపికపై ప్రభుత్వం మీనమేషాలు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పాడై.. రోగులు అవస్థలు పడుతున్నా.. వాటిని బాగుచేసే చర్యలు కనిపించడంలేదు. రాష్ట్రంలోని వివిధ రకాల ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 80,000కు పైగా యంత్రాలు, పరికరాలు ఉన్నట్లు అంచనా. చాలాచోట్ల సిటీస్కాన్లు, వ్యాధి నిర్ధారణ పరికరాలు పనిచేయడంలేదు. కొన్నిచోట్ల మూడేళ్ల నుంచి పనిచేయనివి కూడా ఉన్నాయి. దీంతో సకాలంలో పరీక్షలు జరగక రోగులు ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవలసి వస్తోంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పరికరాలు, యంత్రాల పర్యవేక్షణకు సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక కోసం చాన్నాళ్ల క్రితమే టెండరు పిలిచింది. ఎల్1 వచ్చిన ఓ సంస్థ గురించి వివరిస్తూ.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని గత జూన్ 27న వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. అక్కడి నుంచి తదుపరి చర్యలకు బ్రేక్ పడింది. ఉన్నత స్థాయిలో ఈ సంస్థ ఎంపిక పట్ల సానుకూలత కనిపించడంలేదు. ‘ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. కాస్త ఆగండి’ అని చెబుతూ కాలయాపన చేస్తున్నారని.. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడంలేదని బయోమెడికల్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం.. పర్యవేక్షణ సంస్థ ఎంపికకు ముందు జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగిందా? యంత్రాలు, పరికరాల మరమ్మతులు ఎలా? చెల్లింపులు ఎలా చేస్తారు? మోడల్స్ ఎలా పరిగణనలోనికి తీసుకున్నారు? వంటి పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పష్టత కోరింది. టెండరు ఖరారుకు ముందు జరగాల్సిన ఈ ప్రక్రియ చివర్లో జరుగుతుండడం చర్చనీయాంశమైంది. గతంలో బయోమెడికల్ పరికరాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన సంస్థ పనితీరు ఘోరంగా ఉండడం, అక్రమాలు చోటుచేసుకోవడంతో టెండరు రద్దుచేశారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో పరికరాలు, యంత్రాల పర్యవేక్షణను చూసేందుకు వైద్య ఆరోగ్య శాఖలో ఎవరూ ముందుకు రావడంలేదు. చివరికి వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలోనే ఇతర హెచ్ఓడీ కార్యాలయాల అధికారులతో ఏర్పాటుచేసే ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకున్నారు. చెల్లింపులు జరిగే హెచ్ఓడీ కార్యాలయంలోనే ఈ పర్యవేక్షణ విభాగం ఉండాలని మళ్లీ నిర్ణయించారు. అయితే.. సంస్థతో ఒప్పందం జరగనందున తదుపరి చర్యలకు విఘాతం ఏర్పడింది.
పనిచేయని యంత్రం..
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి రక్త పరీక్షల విభాగంలో బయోకెమిస్ట్రీకి సంబంధించిన పరీక్షలు చేసే రూ. 5.50 లక్షల విలువైన ఫుల్లీ ఆటో అనలైజర్ పరికరమిది.. నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. కొవిడ్ సమయంలో దీనిని తెప్పించారు. ఈ పరికరంతో వివిధ రకాల రక్త పరీక్షలు చేయవచ్చు. కానీ ఇది పనిచేయకపోవడంతో ఒక్కోటీ రూ. 7,500 విలువ చేసే కిట్లు నిరుపయోగంగా మారాయి. ఇవే పరీక్షలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 10,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ భారమంతా రోగులపైనే పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్